NEWS
నిజామాబాద్ లో ఓ దోపిడి దొంగల ముఠా రెచ్చిపోయింది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తి వద్ద నుంచి డబ్బును దొంగిలించారు. ఈ దోపిడీ నిజామాబాద్ లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ముందు జరిగింది. బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళుతున్న ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి డబ్బులు తస్కరిస్తున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.