సల్మాన్ కి బెయిల్

Published : Apr 07, 2018, 03:23 PM IST
సల్మాన్ కి బెయిల్

సారాంశం

రూ.50 వేల పూచీకత్తుతో బెయిలు మంజూరు చేసిన కోర్టు

సల్మాన్‌ ఖాన్‌  కి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. రూ.50వేల పూచీ కత్తుతో ఆయనకు బెయిలు మంజూరు చేశారు.  సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి రవీంద్ర కుమార్‌ జోషి బదిలీ నేపథ్యంలో తొలుత విచారణపై అనిశ్చితి నెలకొంది. కానీ ఆయన ఉదయం విధులకు హాజరై సల్మాన్‌ బెయిల్‌ పిటషన్‌పై విచారణ జరిపారు. తీర్పు మధ్యాహ్నం భోజన విరామం‌ తర్వాత న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
 

రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ఖాన్‌కు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. బెయిల్‌పై శుక్రవారమే విచారణ జరగాల్సి ఉండగా సల్మాన్‌కు బెయిల్‌ ఇవ్వాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి కేసు పూర్తిగా పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తి జోషి శనివారానికి వాయిదా వేశారు. గత రెండు రోజులుగా సల్మాన్‌ జైల్లోనే ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu