ఇక్కడ ఏటీఎంలలో నో క్యాష్.. అక్కడ బస్సులోనే రూ.100కోట్లు

Published : Apr 17, 2018, 02:29 PM IST
ఇక్కడ ఏటీఎంలలో నో క్యాష్.. అక్కడ బస్సులోనే రూ.100కోట్లు

సారాంశం

ప్రైవేటు బస్సులో రూ.100కోట్ల నగదు స్వాధీనం

ఓ పక్క హైదరాబాద్ నగరంలోని ఏటీఎంలలో నగదు లభించక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత వారం రోజులుగా ఏటీఎం వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు వాపోతున్నారు. బ్యాంకుల్లో కూడా సరిపడ నిధులు లేవని అందుకే ఏటీఎంలలో క్యాష్ రావడంలేదనే వాదనలు వినపడుతున్నాయి. ఇలా ఉంటే..  ఓ ప్రైవేటు బస్సులో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.100కోట్ల నగదు లభించింది.

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌ జిల్లా తిప్పగానిపల్లి వద్ద పోలీసులు ఓ ప్రైవేటు బస్సులో రూ.100కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం-బళ్లారి జాతీయరహదారిపై తిప్పగానిపల్లి వద్ద ఈరోజు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేటు బస్సును తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఆ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు లెక్కించగా రూ.100కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది. ఈ నగదును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న దానిపై కర్ణాటక పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంత మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu