కర్నూలులో అశ్లీల నృత్యాలు.. తెర వెనుక సీఐ

First Published Feb 20, 2018, 12:37 PM IST
Highlights
  • కర్నూలులో రేవ్ పార్టీ కలకలం
  • ముగ్గురు యువతులతో అశ్లీల నృత్యాలు

కర్నూలు జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్‌ పార్టీ కలకలం సృష్టించింది. నగరంలోని ఒక ప్రదేశంలో ఒక  ఎరువుల కంపెనీ నిర్వాహకులు తమ డీలర్లకు విందును ఏర్పాటు చేసి ముగ్గురు యువతులతో ఆశ్లీల నృత్యాలు చేయించారు. ఈ పార్టీలో గతంలో నగరంలోని వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో పని చేసిన సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారులు ఉన్నట్లు సమాచారం. 

   
పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ అపార్ట్‌ మెంట్‌లో ఓ ఎరువుల కంపెనీ తమ డీలర్లకు విందు పార్టీని ఏర్పాటు చేసింది. ఇందులో నృత్యాలు చేయడానికి హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువతులను తీసుకొచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన పార్టీ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. రాత్రి 9 గంటల నుంచి యువతులు ఆశ్లీలంగా నృత్యాలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దాదాపు 25 మంది పీకలదాకా మద్యం సేవించి .. ఆ యువతులతో చిందులు వేశారు. కాగా... ఈ రేవ్ పార్టీ గురించి షీటీమ్ కి సమాచారం అందింది.

వెంటనే షీ టీం రాత్రి 11 గంటల ప్రాంతంలో దాడి చేయగా.. సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారుల గుట్టు రట్టయింది. పోలీసులను చూడగానే ఆ సీఐ షీటీంపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అనంతరం సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారులు అక్కడి నుంచి పరారయ్యారు. పార్టీలో నృత్యాలు చేసిన ముగ్గురు యువతులు, మరో 9మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

click me!