32 కు చేరిన రాజస్థాన్ ప్రమాద మృతుల సంఖ్య (వీడియో)

Published : Dec 23, 2017, 12:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
32 కు చేరిన రాజస్థాన్ ప్రమాద మృతుల సంఖ్య (వీడియో)

సారాంశం

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం వంతెనపై నుంచి నదిలో పడ్డ బస్సు 32 మంది ప్రయాణికులు మృతి

ఇవాళ ఉదయం రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్  లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాలు లేకపోవడంతో మితిమీరిన వేగంతో వెలుతున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడింది.  ఈ ప్రమాదంలో 32 మంది ప్రయాణికులు మృత్యువాత పడగా, చాలా మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

వివరాల్లోకి వెళితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు భక్తులు రాజస్థాన్ లోని రామ్ దేవర ఆలయానికి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో దౌసాలాల్ సాట్ నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరారు. అయితే ఈ ఉదయం బస్సు ఓ నది వంతెనపై వెళుతుండగా ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి.. అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు నిద్ర లేవకుండానే మృత్యు ఒడిలోకి చేరిపోయారు.  


ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా క్షతగాత్రులను కాపాడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ఆ తర్వాత మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu
ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది