
క్రికెట్ లో ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాహుల్ ద్రవిడ్ 13 ఏళ్ల రికార్డును చటేశ్వర పుజారా బద్దలు కొట్టారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో పుజారా ఈ ఘనత సాధించాడు.
2004 లో రాహుల్ ద్రవిడ్ ఒక టెస్టు ఒకే ఇన్నింగ్స్ లో 495 బాల్స్ ఆడి 270 పరుగులు చేశాడు. గత 13 ఏళ్లుగా అత్యధిక బంతులు ఆడిన భారత్ బ్యాట్స్ మెన్ గా ద్రవిడ్ పేరు మీదనే ఈ రికార్డు కొనసాగుతోంది.
అయితే ఆస్ట్రేలియా టెస్టులో పుజారా ఈ రికార్డును అధిగమించాడు. నాలుగో రోజు ఆటలో పుజారా మొత్తంగా ఒకే ఇన్నింగ్స్ లో 524 బాల్స్ ఆడి 202 పరుగులు చేశాడు. దీంతో భారత్ తరఫున ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక బాల్స్ ఆడిన రికార్డు పుజారా పేరుతో నమోదైంది.