లలితా జువెల్లరీ దొంగల అరెస్ట్

Published : Dec 18, 2017, 06:31 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
లలితా జువెల్లరీ దొంగల అరెస్ట్

సారాంశం

లలితా జువెల్లరీ దొంగతనం కేసులో పురోగతి  దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ లోని పంజాగుట్ట లలితా జ్యువెల్లరీ లో వారం రోజుల క్రితం భారీ దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ఈ దొంగతనానికి పాల్పడిన నింందితులిద్దరిని ఇవాళ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

 ఈ చోరీకి సంభందించిన వివరాల్లోకి వెళితే పంజాగుట్టలోని లలితా జువెల్లరీ షాప్ లో ఇద్దరు మహిళలు బురఖా ధరించి వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. రూ.6 లక్షల విలువ చేసే బంగారా హారాన్ని దొంగిలించి ఆ స్థానంలో రోల్డ్ గోల్డ్ బంగారుహారాన్ని పెట్టారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సిబ్బంది సీసీటీవీ పుటేజిని పరిశీలించారు. ఇందులో దొంగతనానికి పాల్పడుతున్న వీడియో రికార్డయి వుంది. దీంతో సిబ్బంది ఈ దొంగతనంపై పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు.

సీసీ పుటేజిలో దొంగతనానికి పాల్పడుతున్న మహిళలు బురఖా ధరించి ఉండటంతో పోలీసులు వారిని గుర్తించలేకపోయారు. అయితే  అత్యంత చాకచక్యంగా కేసును ముందుకు నడిపిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను అరెస్ట్ చేశారు.

 

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu