నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి

Published : Jan 14, 2018, 12:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి

సారాంశం

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

సంక్రాంతి పండగ పూట నెల్లూరు జిల్లాలో విషాద చాయలు అలుముకున్నాయి. జిల్లాలోని ఎన్టీఆర్ నగర్ వద్ద గల జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు.

ఇవాళ ఉదయం కురిసిన పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ పొగమంచు వల్ల రోడ్డు పక్కన ఆగివున్న లారీని గమనించని కారులోని వారు వేగంగా వచ్చి ఢీకొనడంతో  ఈ ప్రమాదం సంభవించింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కూడా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా టీపీ గూడూరు వాసులుగా గుర్తించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu