2017 లో ప్రధాని మోదీకి గండం లేదు...

Published : Dec 26, 2016, 11:14 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
2017 లో ప్రధాని మోదీకి  గండం లేదు...

సారాంశం

నోట్ల కష్టాలు 2018 దాకా కొనసాగుతాయి. ఇంకా పెద్ద కష్టాలొస్తాయి దేశానికి. అయితే,  ఇవేవీ ప్రధాని మోదీకి గండం కాదు.

వచ్చే సంవత్సరం అంటే 2017 లో  దేశంలో ప్రజలకు నోట్ల పోటు  మించిన కష్టాలుంటాయని అయితే ఇవేవి  ప్రధాని నరేంద్రమోదీ పదవిని తాకలేవని  ప్రఖ్యాత జ్యోతిష్యుడు శ్రీనివాస గార్గేయ అన్నారు.

 

విశాఖ ప్రెస్ క్లబ్ లో ముందున్న 2017  సంవత్సరం గురించి చెబుతూ ప్రజలకు సంబంధించి రాబోయేవి గడ్డురోజులే అన్నారు. ఇప్పటి నోట్ల సమస్య  ఇంకా చాలా రోజులు కొనసాగుతుందని చెప్పారు.

 

కరెన్సీ కష్టాలకు మించిన కష్టాలను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంకావలని చెబుతూ వీటివల్ల నరేంద్ర మోదీ స్థానానికి ముప్పు లేదని చెప్పారు.

 

దేశంలో చాలా మంది పండిత్ లు మోదీకి  2017లో గండం ఉందని చెబుతూంటే గార్గేయ ఒక్కరే ప్రధానికి గండం ఉందనడాన్ని   కొట్టి పడేశారు.

 

అయితే, ఆయన వివరణ గ్రహగతులకు సంబంధించింది కాకుండా, రాజకీయ విశ్లేషణ లాగా ఉంది.

 

‘పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎన్నికష్టాలు పడ్డా, ఎవ్వరూ నిరసన వ్యక్తం చేయడం లేదు. దీనికి కారణం, దేశానికి ఏదో ప్రధానిగా ఏదో చేస్తారని  మోదీ మీద ప్రజలకు నమ్మకం ఉండటమే కారణం,‘ అని ఆయన అన్నారు.

 

ఈ పరిస్థితి 2018 దాకా  పీడిస్తుందని ఆయన చెప్పారు. అయితే, ఇంతకంటే సీరియస్ సమస్యలు, కరువు కాటకాలు, ఉప ద్రవాలు ముఖ్యంగా విమాన ప్రమాదాలు, రైళ్లప్రమాదాలు, వంటివి తప్పవని కూడా ఆయన జోష్యం చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu