జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

Published : Jan 06, 2018, 06:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

సారాంశం

జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం 100 అడుగుల లోయలో పడ్డ బస్సు

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ మినీ బస్సు 100 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. 15 మంది గాయపడ్డారు.

ఉదంపూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో కరోవా జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. రామ్‌నగర్‌ నుంచి ఉదయంపూర్‌కు ప్రయాణికులతో వెళుతుతుండగా వాహనాన్ని నియంత్రించడంలో డ్రైవర్‌ విఫలం కావడంతో బస్సు లోయలో పడిపోయింది. ఘటనా స్థలిలో నలుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. గాయపడిన 15 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu