ఆల్ప్స్ పర్వతంపై మానవ అవశేషాలు

Published : Jul 29, 2017, 02:40 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఆల్ప్స్ పర్వతంపై మానవ అవశేషాలు

సారాంశం

ఓ మనిషి చేయి, తొడ భాగం లభ్యం 1966లో జరిగిన ప్రమాదంలో 117 మంది ప్రాణాలు కోల్పోయారు. 1950లో జరిగిన ప్రమాదంలో 48మంది మృతి చెందారు

యాభై ఏళ్ల క్రితం జరిగిన ఓ విమాన ప్రమాదానికి సంబంధించిన మానవ శకలాలను ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్‌ పర్వతాలపై గుర్తించారు. ఈ అవశేషాలు 1966 లేదా 1950లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతులవి అయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

డేనియల్‌ రోచేకు విమాన ప్రమాద అవశేషాలను గుర్తించడమంటే ఆసక్తి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలను తెలుసుకుని వాటి శిథిలాలను సేకరించారు. ఈ నేపథ్యంలో ఆల్ప్స్‌ పర్వతాలపై మానవ అవశేషాలను గుర్తించి... అధికారులకు సమాచారం అందించాడు.

ఇప్పటి వరకు తాను చాలా విమాన శకలాలను కనుగొన్నానని.. కానీ మానవ శకలాలు మాత్రం గుర్తించలేదని... ఈ సారి ఓ మనిషి చేయి, తొడ భాగాన్ని కనుగొన్నాను అని రోచే తెలిపారు.

1966 జనవరిలో బాంబే నుంచి న్యూయార్క్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 707 విమానం.. మాంట్‌ బ్లాక్‌ సమీపంలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో 117 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు 1950లో మరో ఎయిరిండియా విమానం ఇదే పర్వత ప్రాంతంలో కూలింది. ఈ ఘటనలో 48 మంది మరణించారు. ఈ రెండు విమానాలల్లో ఒక విమానంలోని మృతుల అవశేషాలు అయ్యి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !