పసిడి@ రూ.30కే, వెండి @ రూ.40కే

Published : Aug 17, 2017, 04:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
పసిడి@ రూ.30కే, వెండి @ రూ.40కే

సారాంశం

పది గ్రాముల పసిడి ధర రూ.30,050 కేజీ వెండి ధర రూ.40,200

 

బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చాయి. ఈరోజు బంగారం ధర రూ.30వేల మార్క్ ని దాటింది. రూ.300 పెరిగి పది గ్రాముల పసిడి ధర రూ.30,050కి చేరింది. పెళ్లిళ్ల సీజన్, స్థానిక వ్యాపారుల వద్ద నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర పెరిగిందని బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. ఈరోజు వెండి ధర రూ.40వేల మార్క్ ని దాటింది. రూ.900 పెరిగి కేజీ వెండి ధర రూ.40,200కు చేరుకుంది. వెండి నాణేల కొనుగోళ్లు పెరగడంతో వెండి ధర పెరిగిందని బులియన్ వర్గాలు తెలిపాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో 0.43శాతం పెరిగి ఔన్సు బంగారం ధర  1,288 డాలర్లకు చేరుకుంది. 0.12 శాతం పెరిగి ఔన్సు వెండి ధర 17.12 డాలర్లకు చేరుకుంది.

దేశ రాజధాని దిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల తులం బంగారం ధర  రూ.30,050 గా ఉండగా... 99.5 శాతం స్వచ్ఛత గల  తులం బంగారం ధర రూ.29,900గా ఉంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !