భారీగా పెరిగిన బంగారం ధర

Published : Sep 08, 2017, 09:08 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
భారీగా పెరిగిన బంగారం ధర

సారాంశం

తులం బంగారం ధర రూ.31,350 కేజీ వెండి ధర రూ.42 వేలు

బంగారానికి రెక్కలు వచ్చాయి. ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్‌ ఇర్మా ప్రభావంతో శుక్రవారం పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే రూ.990లు పెరిగింది. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.31,350కి చేరుకుంది. ఈ ఏడాది అత్యధికంగా పసిడి ధర పెరిగింది ఈ రోజే.అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

 

ఈ రోజు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి రూ.42వేలకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. 2015 కనిష్ఠానికి డాలర్‌ విలువ పడిపోవడం అంతర్జాతీయ మార్కెట్‌కు కలిసొచ్చిందని బులియన్‌ ట్రేడర్లు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధర 0.31శాతం పెరగడంతో ఔన్సు 1,352.80డాలర్లు పలికింది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu