ఉద్యోగి సూసైడ్... నలుగురిపై వేటు

Published : Nov 24, 2017, 11:22 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఉద్యోగి సూసైడ్... నలుగురిపై వేటు

సారాంశం

ఆత్మహత్యకు పాల్పడిన ఉద్యోగి కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

గుంటూరు వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రవికుమార్ ఆత్మహత్య కేసులో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. రవికుమార్  ఆత్మహత్య చేసుకోవడానికి కారకులుగా భావించి.. నలుగురు అధికారులు రత్నం రాజు, మల్లికార్జున రావు, భానుమూర్తి, ప్రసాద్ లపై వేటు వేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం  మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.

ప్రమోషన్ ను అడ్డుకుంటున్నారన్న ఆరోపిస్తూ రవికుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే ముందు.. తన ఆత్మహత్యకు గల కారణాలను తెలియజేస్తూ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. ఆ వీడియో ఆధారంగానే అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. రవికుమార్ ప్రమోషన్ అడ్డుకోవడం, అతనిపై తీవ్ర ఒత్తిడి పెంచడానికి కారణమైన అధికారులపై శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. కాగా.. ఆ నలుగురు అధికారులను అరెస్టు చేయాలని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu