భారత మార్కెట్లోకి మరో రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

First Published Feb 19, 2018, 2:05 PM IST
Highlights
  • కోమియో నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు

చైనాకి చెందిన మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ కోమియో భారత మార్కెట్లోకి తాజాగా రెండు స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. బడ్జెట్ ధరలో ఈ రెండు ఫోన్ ని ప్రవేశపెట్టింది. కోమియో ఎస్1 లైట్ పేరిట విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.7,499 కాగా కిమియపో సీ2 లైట్ ఫోన్ ధర రూ.5,999గా ప్రకటించింది.

 

కోమియో ఎస్1 లైట్ ఫోన్ ఫీచర్లు...

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

కోమియో సీ2 లైట్ ఫోన్ ఫీచర్లు...

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3900 ఎంఏహెచ్ బ్యాటరీ.

click me!