భారత్ కు సునామి ముప్పు ?  ప్రధాని మోదీకి లేఖ

Published : Sep 30, 2017, 09:31 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
భారత్ కు సునామి ముప్పు ?  ప్రధాని మోదీకి లేఖ

సారాంశం

 డిసెంబర్ 31 లోపు హిందూమహా సముద్రంలో భారీ భూకంపం   11 దేశాలమీద ప్రభావం

భారతదేశానికి మరొక  సునామి ముప్పు ఉందా? ముప్పు ఉందని, 2018 డిసెంబర్ 31లోపు సునామి భారత్ తో పాటు అనేక దేశాలను అతలాకుతలం చేయనుందని కేరళ కు చెందిన  బికె రీసెర్చ్ అసోసియేషన్ ఫర్ ఇ ఎస్ పి. హెచ్చరిస్తున్నది. హిందూమహా సముద్రంలో వచ్చే భూకంపం వల్ల ఇది సంభవించనుంది. ఈ హచ్చరికను ఈ సంస్థ అధిపతి బాబు కలాయిల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తూ చెప్పారు.

హిందూ మహా సముద్రంలో డిసెంబర్ 31 లోపు సునామి వస్తున్నదని తమ సంస్థ పసిగట్టిందని, ఈ సునామీ ఆసియా దేశాలను కుదిపేయనుందిని ఈ లేఖలో  ఆయన పేర్కొన్నారు.  ఈ భారీ సునామీ సముద్ర ఒడ్డులను తారు మారు చేస్తుందని చెబుతూ  దీని ప్రభావం పదకొండు దేశాలలో అంటే భారత్, చైనా, జపాన్, పాకిస్తాన్, నేపాల్, బాంగ్లాదేశ్,ధాయ్ లాండ్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంల మీద ఉంటుందని ఈ సంస్థ లేఖలో పేర్కొంది.

హిందూ మహాసముద్రంలో వచ్చే ఈ భూకంపం వ్లల సీష్మా అనే తుఫాను వస్తుందని, ఫలితంగా  120 నుంచి 180 కి.మీ వేగంతో గాలలు వీస్తాయని  బాబు హెచ్చరిస్తున్నారు.

ఈ బాబు కలాయిల్ తనలో అతీంద్రియ శక్తులన్నాయని చెప్పుకుంటు ఉంటాడు.  2004 డిసెంబర్ లో సునామి రాకను కూడా తాను రెన్నెళ్ల ముందే   పసిగట్టి హెచ్చరిక చేశారని  చెబుతాడు. అయితే, జియాలిస్టులు దీన్ని అబద్దంగా కొట్టి పడేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu