ఉత్తర ప్రదేశ్ లో ఇసుక తుఫాను... 11మంది మృతి

Published : May 10, 2018, 12:44 PM ISTUpdated : May 10, 2018, 01:43 PM IST
ఉత్తర ప్రదేశ్ లో ఇసుక తుఫాను... 11మంది మృతి

సారాంశం

మరో 11మందికిపైగా గాయాలు

ఉత్తరప్రదేశ్ లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ తుఫాను కారణంగా 11మంది మృతి చెందగా.. మరో 11 మందికి పైగా మృతి చెందారు. కేవలం బుధవారం సాయంత్రం వచ్చిన తుఫాను కారణంగానే వీరంతా మరణించడం గమనార్హం.

ఎత్వా, మధుర, అలిగర్, ఫిరోజాబాద్ ప్రాంతాల్లో ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. కాన్పూర్ లో ఓ వ్యక్తి పిడుగుపాటుకి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆగ్రాలో ఓ వ్యక్తి చెట్టు కూలి పడటంతో మృతిచెందాడు.

గత వారం రోజులుగా ఉత్తరప్రదేశ్ లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టిస్తూనే ఉంది.గతంలో ఈ తుఫాను కారణంగా 64మంది మృతిచెందగా.. మరో 160మంది గాయపడ్డారు. కాగా.. తాజాగా మరో 11మంది మృతిచెందారు. పక్క రాష్ట్రమైన రాజస్థాన్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu