
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ముగ్గురు వ్యక్తులు బైక్ మీద వెడుతూ.. ఓ యువకుడిని బండికి కట్టి లాక్కెళ్లారు. అలా కి.మీ మేర ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. ఈ ఘ ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బరేలీలోని బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ హోలీ కూడలిలో ఈ ఘటన జరిగింది.ప్రియుడి మోజులో భర్తను హత్య చేసి.. మృతదేహాన్ని గొడలితో ముక్కలుగా నరికి..
ట్విటర్లో పోస్ట్ చేసిన సంఘటనకు సంబంధించిన వీడియోలో, స్కూటీపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని తాడుతో కట్టి లాగడం కనిపిస్తుంది. ఈ ఘటన మీద పోలీసుల విచారణ జరుగుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. జూలై 25న సాయంత్రం 4:35 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో తెలుస్తోంది. ముందుగా ఆ యువకుడిని చౌరస్తా మధ్యలో స్కూటీకి కట్టేశారు. ఆ తరువాత వెంటనే, వారు అతనిని లాగడం ప్రారంభించారు.
దీంతో యువకుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. దుండగులను ఇంకా గుర్తించలేదు. వారు ఎందుకు అలా చేశారో కూడా కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయాల్సి ఉంది. అయితే సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.