రైలు పట్టాలపై యువకుడి మృతదేహం...సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్

Published : Dec 08, 2018, 12:39 PM IST
రైలు పట్టాలపై యువకుడి మృతదేహం...సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్

సారాంశం

మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ 20 ఏళ్ల యువకుడు  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నకళ్యాణ్ రైల్వే స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. 

మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ 20 ఏళ్ల యువకుడు  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నకళ్యాణ్ రైల్వే స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. 

అయితే రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మృతదేహంతో పాటు ఓ మొబైల్ ఫోన్ ను గుర్తించారు.

ఆ మొబైల్ ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నించిన పోలీసులకు షాకింగ్ వీడియో కనిపించింది. అతడు తన ఆత్మహత్యకు ముందు ఓ వీడియో రికార్డు చేశాడు. అందులో తన పేరు రోహిత్ పరదేశీగా పేర్కొంటూ...తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ తెలిపాడు. తన మానసిక ఇబ్బందులు, కష్టాల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.  

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెల్ ఫోన్ ఆధారంగా మృతిడి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu