నా ఒళ్లో ఆడుకున్న పిల్లాడివి.. ముందు నే చెప్పేది విను... తేజస్వికి నితిష్ ఝలక్

By AN TeluguFirst Published Feb 24, 2021, 9:26 AM IST
Highlights

బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నితిష్ కుమార్ యాదవ్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన ప్రసంగాన్ని అడ్డుకున్న తేజస్వీ యాదవ్ ను ఉద్దేశించి ‘ఆ టైంలో నువ్వు ఒళ్లో ఆడుకుంటున్న పిల్లాడివి’ అంటూ రిటార్ట్ ఇచ్చారు.

బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నితిష్ కుమార్ యాదవ్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన ప్రసంగాన్ని అడ్డుకున్న తేజస్వీ యాదవ్ ను ఉద్దేశించి ‘ఆ టైంలో నువ్వు ఒళ్లో ఆడుకుంటున్న పిల్లాడివి’ అంటూ రిటార్ట్ ఇచ్చారు. 

అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో సమయంలో యూనియన్ మినిస్టర్ గా ఉన్న నితీష్ కుమార్ యాదవ్ పై తేజస్వీ యాదవ్ చేసిన కామెంట్స్  చేస్తే.. దానికి సమాధానంగా.. ‘ఆ టైంలో నువ్వు చిన్నపిల్లాడివి, నేను కూడా నిన్ను ఎత్తుకున్నాను’ అంటూ మట్లాడారు. 

తేజస్వీ యాదవ్ నితీష్ కుమార్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 2017లో జేడీయూ-ఆర్జేజీ కూటమి ప్రభుత్వం కూలడంతో ప్రతిపక్షనేతగా మారారు. 

బడ్జెట్ సెషన్ మూడవ రోజు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నితిష్ కుమార్  ప్రసంగించారు. రాష్ట్రంలో 15 సంవత్సరాల తమ ప్రభుత్వం పాలనలో  సాధించిన విజయాలపై మాట్లాడుతున్న జెడియు నాయకుడిని, తేజస్వీ యాదవ్ అనేకసార్లు అడ్డుకున్నారు.

నేను మాట్లాడడం పూర్తయ్యాక మీకు ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడండి. కానీ ఇప్పుడు మాత్రం నేను మాట్లాడేది వినండి. దీనివల్ల మీకే ప్రయోజనం ఉంటుంది.. అని నితిష్ కుమార్ చురక అంటించారు. 

ఆ తరువాత, యాదవ్ తన ప్రసంగంలో, బిజెపి-జెడియు ప్రభుత్వంలో రాష్ట్రంలో నేరాలు పెరగడంపై మాట్లాడారు. అంతేకాదు నితిష్ కుమర్ బీజేపీ  "స్టెప్నీ-స్టూజ్" అంటూ తేజస్వీ కామెంట్ చేశారు. 

ఇంకా మాట్లాడుతూ.. నితిష్ కుమార్ ప్రభుత్వం 43 సీట్లు మాత్రమే గెలిచింది, దీంతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  బిజెపి 74 గెలిచింది, మిస్టర్ యాదవ్ పార్టీ కంటే ఒక్క సీటే తక్కువ. అయితే నితిష్ కుమార్ బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. 
 

click me!