
కర్ణాటక : కర్ణాటకలో ఓ భార్య తన ‘గే’ భర్తతో వేగలేకపోతున్నానంటూ విడాకులు కావాలంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన భర్త తనతో కాపురం చేయడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కర్ణాటకలోని జ్ఞాన భారతి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ మహిళకు.. 2020 ఆగస్టు 30వ తేదీన ఐటీ ఇంజనీర్ అయిన ఓ వ్యక్తితో వివాహమయ్యింది.
అతను మల్లత్తహళ్లి బాలాజీ లేఅవుట్ నివాసి. మహిళ ఎంబీఏ చదువుకుంది. పెళ్లికి ముందే ఇన్ఫోసిస్ లో ఉద్యోగం వచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా రెండేళ్లు ఇన్ఫోసిస్ లోనే ఉద్యోగం చేసింది. ఆ తర్వాత ఉద్యోగం చేయొద్దు అంటూ అత్తామామా సతాయిస్తుండడంతో మానేసింది. మరోవైపు పెళ్లే రెండేళ్లు అవుతున్నా.. భార్యాభర్తల మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు.
తెలంగాణలో కేసీఆర్ సీన్ తక్కువే : కేంద్రంలో కమల వికాసమే..
పెళ్లయి రెండేళ్లయినా ఇంకా పిల్లలు పుట్టడం లేదంటూ బంధువులు, ఇరుగుపొరుగువారు ప్రశ్నించడం ఎక్కువైపోయింది. ఇంకో వైపు తమ తర్వాత పెళ్లయిన మరిదికి ఏడాదిలోనే పిల్లలు పుట్టారు. దీంతో అత్తామామలు, బంధువులు, చుట్టుపక్కల వారి జాలి చూపులు, ప్రశ్నలు.. సమస్య ఏంటి అని అడగడం ఎక్కువైపోయింది.
ఈ విషయాన్ని భర్తతో చర్చించినా పట్టించుకోలేదు. వీటిని తట్టుకోలేక ఆమె కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించింది కానీ అది కూడా విఫలమయింది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె భర్త మొబైల్ ను పరిశీలించింది. అందులో కనిపించిన ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అయ్యింది.
భర్త మరో పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోలు అవి. ఈ విషయంపై ఆమె భర్తను నిలదీసింది. విషయం భార్యకు తెలిసిపోయిందని గమనించిన ఆ భర్త వేధింపులు మొదలుపెట్టాడు. ఓవైపు తనతో సంసారం చేయకుండా హింసించడం.. ఇంకో పురుషుడితో రాసలీలలతో ఆమె విసిగిపోయి పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో... ఇలాంటి తప్పు మరోసారి చేయనని భర్త నిత్యం ఫోన్ చేసేవాడు. ఇంటికి రావాలని కోరేవాడు. భార్య ఇంటికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో పెద్దలు కలగజేసుకున్నారు. రాజీకి ప్రయత్నించారు. కానీ, ఇలాంటి ‘గే’ భర్తతో కాపురం చేయడం తనవల్ల కాదని తేల్చి చెప్పింది. ఆమె అలా చెప్పడంతో వేధింపులు మరింత పెరిగాయి. ఇక తట్టుకోలేక ఆమె భర్త, అత్తామామలమీద జ్ఞానభారతి పీఎస్ లో ఫిర్యాదు చేసింది.