ఢిల్లీ మెట్రోలో మహిళ రభస.. వీడియో వైరల్..!

Published : Aug 04, 2023, 09:46 AM IST
 ఢిల్లీ మెట్రోలో మహిళ రభస.. వీడియో వైరల్..!

సారాంశం

 ఓ మహిళ ఢిల్లీ మెట్రోలో నానా రభస చేసింది.  ఆమె కారణంగా మరో ఇద్దరు మహిళలు ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


ఉద్యోగం చేసేవారు ప్రతిరోజూ ఏదో ఒక విధంగా కార్యాలయాలకు వెళ్లక తప్పదు. అయితే, అలా వెళ్తున్న సమయంలో చాలా మంది మనకు తరాసపడుతుంటారు. అయితే,  అలా తారసపడినవారందరితో మనకు మంచి అనుభవం ఉండకపోవచ్చు. ఒక్కోసారి వింత అనుభవాలు కూడా ఎదురౌతూ ఉంటాయి. తాజాగా ఇద్దరు మహిళల విషయంలో అదే జరిగింది.  ఓ మహిళ ఢిల్లీ మెట్రోలో నానా రభస చేసింది.  ఆమె కారణంగా మరో ఇద్దరు మహిళలు ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


ఢిల్లీ మెట్రో కోచ్‌లో ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మహిళ ఇద్దరు మహిళలతో గొడవ పడటం విశేషం. క్లిప్‌లో, గులాబీ రంగు దుస్తులు ధరించిన ఒక మహిళ నల్లటి దుస్తులను ధరించిన మరో మహిళపై అరుస్తూ కనిపించింది. "హా హు మై పాగల్ (అవును నాకు పిచ్చి ఉంది)" అని ఆమె ఆ స్త్రీపై అరుస్తుంది. అవతలి మహిళ ఆమెను టోన్ చేయమని అడిగినప్పుడు, “భౌక్, తుజే జిత్నా భౌక్నా (మీకు కావలసినంత అరవండి)” అని ఆమె చెప్పడం వినిపించింది.

 

మరొక క్లిప్‌లో, పింక్ సూట్ ధరించిన మహిళ అదే మెట్రో కోచ్‌లో మరొక ప్రయాణికురాలితో వాదించడం గమనార్హం. మరొక మహిళ వాగ్వాదాన్ని రికార్డ్ చేసింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. ఆమె అంత అరిచినా, సదరు  మహిళ చాలా ఓపికగా సమాధానం చెప్పడం గమనార్హం. ఆ మహిళ చేసిన రభసను నెటిజన్లు విమర్శించడం గమనార్హం.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu