సీఆర్‌పీఎఫ్ క్యాంప్ పై బాంబు విసిరిన మ‌హిళ‌.. జ‌మ్మూకాశ్మీర్ లో ఘ‌ట‌న

Published : Mar 30, 2022, 02:10 PM IST
సీఆర్‌పీఎఫ్ క్యాంప్ పై బాంబు విసిరిన మ‌హిళ‌.. జ‌మ్మూకాశ్మీర్ లో ఘ‌ట‌న

సారాంశం

బురఖా ధరించిన ఓ మహిళ సీఆర్‌పీఎఫ్ క్యాంప్ పై బాంబు వేశారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ లో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) క్యాంపుపై మంగ‌ళ‌వారం సాయంత్రం బురఖా ధరించిన ఓ మహిళ బాంబు విసిరింది. ఈ దృశ్యాలు క్లియ‌ర్ గా అక్కడున్న సీసీ కెమెరాల‌కు చిక్కాయి. ఈ వీడియోను సీఆర్‌పీఎఫ్ విడుద‌ల చేసింది. 

ఈ సీసీటీవీ ఫుటేజీలో... ఓ వైపు నుంచి బుర్ఖా ధ‌రించిన మ‌హిళ న‌డుచుకుంటూ వ‌స్తుంది. స‌రిగ్గా సీఆర్పీఎఫ్ క్యాంపు ముంద‌ర ఉన్న రోడ్డుపైన ఆగి, త‌న వ‌ద్ద ఉన్న బ్యాగ్ లోని బాంబుని హ‌డావిడిగా తీసింది. ఆ త‌రువాత ఈ బాంబుని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై విసిరింది. అనంత‌రం అక్క‌డి నుంచి వేగంగా పారిపోయింది. 

 

ఈ ఘ‌ట‌న భద్రతా శిబిరం వెలుపల జ‌రిగింద‌ని, ఎలాంటి ప్రాణ‌న‌ష్టం సంభ‌వించ‌లేద‌ని అధికారులు తెలిపారు. అలాగే సిబ్బందికి కూడా ఎలాంటి గాయాలు కాలేద‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. 

మహిళను గుర్తించి, ఆమె ఆచూకీ కోసం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వీడియోలో ఉన్న మ‌హిళ‌ను గుర్తించినట్టు, ఆమెను త్వరలో అరెస్టు చేస్తామని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
PM Modi Visit Oman: ఒమన్ లో మోదీకి ఘనస్వాగతంభారత ప్రజలు | Asianet News Telugu