భర్తతో ఘర్షణ: ఐదుగురు పిల్లలను గంగానదిలో పడేసిన మహిళ

Published : Apr 13, 2020, 06:45 AM ISTUpdated : Apr 13, 2020, 06:48 AM IST
భర్తతో ఘర్షణ: ఐదుగురు పిల్లలను గంగానదిలో పడేసిన మహిళ

సారాంశం

ఓ మహిళ తన ఐదుగురు పిల్లలను గంగానదిలో పడేసింది. భర్తతో గొడవ పడిన మహిళ ఆ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

భాదోహి: భర్తతో గొడవ పడిన ఓ మహిళ అత్యంత దారుణమైన చర్యకు     ఒడిగట్టింది. భర్తతో గొడవ పడిన మహిళ తన ఐదుగురు పిల్లలను గంగానదిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది.

మంజు యాదవ్, మృదుల్ యాదవ్ గత ఏడాది కాలంగా కుటుంబ విషయాలపై గొడవపడుతూ పస్తున్నారు. పిల్లలను నదిలో పడేసి చంపాలని ఆమె ఆలోచించిందని పోలీసులు చెప్పారు. 

శనివారం రాత్రి భర్తతో గొడవ పడిన మంజు తన ఐదుగురు పిల్లలను నదిలో పడేసింది. జహీంగరాబాద్ ఘాట్ వద్ద పిల్లలను ఆమె నదిలో పడేసింది. అక్కడ నీరు చాలా లోతుగా ఉంటుంది. 

కొంత మంది మత్స్యకారులు పిల్లల అరుపులు విన్నారని, చీకట్లో వారి అరుపులు వినిపించడంతో భయపడి పారిపోయారని అంటున్నారు. పిల్లలను నదిలో పడేసిన తర్వాత మహిళ ఒడ్డునే ఉండిపోయింది. తెల్లారి గ్రామస్తులకు విషయం చెప్పింది.

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families