ఇళ్లంతా దోచేసి...కుటుంబసభ్యులను బంధించి.. వారి ముందే మహిళపై గ్యాంగ్‌రేప్

Published : Sep 07, 2018, 08:20 AM ISTUpdated : Sep 09, 2018, 12:28 PM IST
ఇళ్లంతా దోచేసి...కుటుంబసభ్యులను బంధించి.. వారి ముందే మహిళపై గ్యాంగ్‌రేప్

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇంట్లో దోపిడికి వచ్చిన దుండగులు ఇళ్లంతా దోచేసి.. ఆ ఇంట్లోని మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇంట్లో దోపిడికి వచ్చిన దుండగులు ఇళ్లంతా దోచేసి.. ఆ ఇంట్లోని మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘజియాబాద్‌ జిల్లాలోని కక్రా జిల్లాలో బుధవారం రాత్రి ఐదుగురు దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించారు.

కుటుంబసభ్యులను మారణాయుధాలతో బెదిరించి అందరిని తాళ్లతో కట్టేశారు. అనంతరం ఇంట్లోని నగదు, విలువైన వస్తువులను దోచేశారు. దొంగతనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. వారిలోని ఇద్దరి కన్ను ఓ మహిళపై పడింది.

కుటుంబసభ్యుల కళ్ల ముందే ఆమెపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి.. బాధితురాలిని వైద్య పరీక్షల  నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations