దారుణం... సవితి పిల్లలకు చికెన్ లో విషం కలిపి తినిపించిన మహిళ.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..

By SumaBala BukkaFirst Published Nov 26, 2022, 7:20 AM IST
Highlights

తన కడుపున పుట్టలేదు కదా అనుకుందో.. తన కాపురానికి అడ్డు అనుకుందో ఓ మహిళ అతి దారుణానికి ఒడిగట్టింది. తన భర్త మొదటి భార్య పిల్లలకు విషం ఇచ్చి అడ్డు తొలగించుకోవాలనుకుంది. 

ఝార్ఖండ్ : సవితి తల్లి అంటే సమాజంలో ఉండే నెగెటివ్ భావాన్ని మరింత పెంచే పనిచేసింది ఓ మహిళ... అభం, శుభం తెలియని చిన్నారులకు చికెన్ లో విషం పెట్టి చంపాలని ప్రయత్నించింది. భార్య చనిపోయిన పిల్లలు అనాథలుగా మారకుండా ఉండాలని.. రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తికి తేరుకోలేని షాక్ ఇచ్చింది ఆమె. అలా తన భర్త మొదటి భార్య పిల్లలకు విషం పెట్టి చంపాలని చూసింది ఓ సవతి తల్లి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 

పోలీసుల కథనం ప్రకారం ఝార్ఖండ్ గిరిదిహ్ జిల్లాలోని రోహంతాండ్ కు చెందిన సునీల్ భార్య రెండేళ్ల క్రితం పాముకాటుకు గురై చనిపోయింది. అప్పటికే ఆమెకు ఒక కుమార్తె, నలుగురు మగపిల్లలు ఉన్నారు. ఈ యేడాది ఏప్రిల్ లో సునీల్.. గోరియాచు గ్రామానికి చెంది సునీత హన్డ్సా అనే మహిళను రెండు వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇంకా పిల్లలు లేరు. సవితి పిల్లలు ఇష్టం లేకపోతే.. పెళ్లికి ముందే చెప్పాలి.. లేదంటే పెళ్లి మానుకోవాలి.. ఇంకా కాకపోతే.. తాత, నానమ్మల దగ్గరో.. అమ్మమ్మ వాళ్ల దగ్గరో ఉంచాలి కానీ.. ఏకంగా లోకంలోనే లేకుండా చేయాలనుకుంది ఆమె. దీనికోసం.. 

అదర్ పూనావాలా ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి రూ. కోటి చీటింగ్.. ఏడుగురి అరెస్ట్..

సెప్టెంబర్ లో మొదటి భార్య పిల్లలందరినీ వాళ్ల తాతయ్య, నానమ్మ దగ్గర వదిలిన సునీత భర్తతో కలిసి దుర్గా పూజ కోసం సొంతూరుకు వెళ్ళింది. గురువారం ఉదయం అనిల్  సొరైన్ (3), శంకర్ సొరైన్(8), విజయ్ సొరైన్ (12ల)కు చికెన్ లో విషం కలిపి తినిపించింది. వారి ఆరోగ్యం క్షీణించిన తరువాత పారిపోయింది. ఈ ఘటనలో అనిల్ సొరైన్ మృతిచెందగా, శంకర్ సొరైన్ పరిస్థితి విషమంగా ఉంది. విజయ్ సొరైన్ ప్రాణాలతో బయటపడ్డాడు అని పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వారు పేర్కొన్నారు.

click me!