కోరిక తీర్చాలని బలవంతం: విసిగిపోయి భర్తను చంపిన భార్య

By telugu teamFirst Published Feb 21, 2021, 8:55 AM IST
Highlights

తమిళనాడులోని ఈ రోడ్ జిల్లాలో ఓ మహిళ తన భర్తకు విషమిచ్చి హతమార్చింది. గర్భవతి అయిన తనను కోరిక తీర్చాలంటూ అతను తరుచుగా వేధిస్తుండడంతో విసిగిపోయి ఈ దారుమానికి పాల్పడింది.

చెన్నై: ఓ మహిళ అత్యంత దారుణానికి ఒడిగట్టింది. తాళి కట్టిన భర్తను విషమిచ్చి చంపేసింది. దాంతో పోలీసులు శనివారంనాడు ఆ మహిళను అరెస్టు చేశారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా అందియూర్ కు చెందిన నందకుమార్ (35)కు ఏడు నెలల క్రితం మైథిలి అనే మహిళతో వివాహమైంది. 

నందకమూర్ ఇటీవల కడుపునొప్పి, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అతను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అతని రక్తంలో విషం కలిసినట్లు వైద్యులు గుర్తించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతని వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారు 

జనవరి 28వ తేదీన భోజనం చేస్తుంటే ఆహారం చేదుగా అనిపించిందని, ఇదేమిటని భార్యను అడిగితే ఏమీ లేదని చెప్పిందని అతను తన వాంగ్మూలంలో చెప్పాడు. చికిత్స పొందుతూ ఈ నెల 15వ తేదీన నందకుమార్ మృత్యువాత పడ్డాడు. దాంతో మైథిలిని పోలీసులు విచారించారు. 

ఐదు నెలల గర్బంతో ఉన్న తనను భర్త కోరిక తీర్చాలంటూ తరుచుగా బలవంతం చేస్తున్నాడని, ఎంతగా వద్దని చెప్పినా వినలేదని, దాంతో తాను అనారోగ్యానికి గురయ్యానని ఆమె పోలీసులు విచారణలో తెలిపింది. దాంతో ఆహారంలో విషం కలిపి భర్తకు పెట్టానని ఆమె చెప్పింది. కేసు నమోదు చేసుకుని శనివారంనాడు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 

click me!