ఉత్తరప్రదేశ్ లో కదులుతున్న రైలులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. రైల్వే టీటీఈ మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో ఓ వికృతమైన ఘటన వెలుగు చూసింది. కదులుతున్న రైలులో ఓ కీచక టికెట్ కలెక్టర్ దారుణానికి పాల్పడ్డాడు. తన సహచరులతో కలిసి ఓ మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన జనవరి 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…చందౌసి రైల్వేస్టేషన్ లో జనవరి 16న ఒక మహిళ ట్రైన్ కోసం ఎదురు చూస్తోంది. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ అయిన నిందితుడు ఆమెను ట్రైన్ లోని ఏసీ కోచ్ లో సీట్ ఇప్పిస్తానని చెప్పాడు.
ఈ మేరకు ఆమెకు సహాయం చేస్తున్నట్లుగా నటించి ఆమెను ఏసీ కోచ్ లో కూర్చోబెట్టాడు.సదరు బాధిత మహిళ చందౌసి నుంచి ప్రయోగరాజ్ లోని సుబేదార్ గంజ్ కు వెళ్లాలి. ఏసీ కోచ్ లో కూర్చోబెట్టిన సదరు మహిళపై రాత్రి పది గంటల సమయంలో చందౌసి టీటీఈ, మరొక వ్యక్తి కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె సంభాల్ జిల్లాలోని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ రైలుకు టీటీఈలుగా పనిచేసిన పలువురిని మహిళకు చూపించారు. వారిలో నిందితుడైన టీటీఈని ఆ మహిళ గుర్తు పట్టింది. కానీ, అతనితో పాటు తన మీద అత్యాచారానికి పాల్పడిన మరొక వ్యక్తిని గుర్తించలేదు. సదరు నిందితుడైన టిటిఈని పోలీసులు రాజు సింగ్ గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని.. అరెస్టు చేశారు. రాజుతో పాటు అఘాయిత్యానికి పాల్పడిన మరొక నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
బీహార్లో దారుణం...60 ఏళ్ల టీచర్ పై మహిళా కానిస్టేబుళ్ల లాఠీఛార్జ్..
యూపీలోని సంభాల్ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల మహిళ డెహ్రాడూన్-ప్రయాగ్రాజ్ లింక్ ఎక్స్ప్రెస్లోని ఏసీ 1వ కోచ్లో తన రెండేళ్ల కొడుకుతో కలిసి ఉండగా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ మరో వ్యక్తి అత్యాచారం చేశారు.యూపీలో కదులుతున్న రైలులో వారం వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. జనవరి 16వ తేదీ రాత్రి మహిళ చందౌసి నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తాను మొదట్లో మౌనంగా ఉన్నానని, అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నానని ఆ మహిళ పేర్కొంది.
నిందితులపై శనివారం ఐసీపీ సెక్షన్ 376-డి (గ్యాంగ్రేప్) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అదే రోజు సాయంత్రం రైల్వే పోలీసులు మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు ఆదివారం తెలిపారు. ఏసీ 1వ కోచ్లోని ఖాళీ క్యాబిన్లో తనకు సీటు ఇచ్చారని, ఆ తర్వాత మత్తుమందు కలిపిన నీటిని అందించారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. నిందితుడు తనను హెచ్ఏ1 కోచ్లో కూర్చోమని కోరిన రికార్డింగ్ తన వద్ద ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. తాను మత్తుమందుల ప్రభావంలో ఉన్నానని, అందుకే సహాయం కోసం చూడలేకపోయానని, నిందితుడు అలీగఢ్ రైల్వే స్టేషన్లో దిగిపోయాడని ఆమె చెప్పింది. చందౌసికి చెందిన జీఆర్పీ ఇన్స్పెక్టర్ కెఎన్ సింగ్ మాట్లాడుతూ.. “ఆ మహిళ జనరల్ టిక్కెట్పై ప్రయాణిస్తుండగా, ఆమెకు నిందితుడైన టీటీఈ మూడేళ్లుగా తెలుసు.. దీంతో ఆమెకు ఏసీ ఫస్ట్ కోచ్లో సీటు ఇచ్చాడు.
కాగా బాధితురాలైన సదరు మహిళా ఇంతకుముందు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసేదని, తరచూ రైలులో ప్రయాణించేదని ఈ క్రమంలోనే ఆమెకు బహుశా టీటీఈ తెలిసి ఉంటాడని పోలీసులు తెలిపారు. కాగా, ఈ వారం ప్రారంభంలో, సుల్తాన్పూర్లోని 27 మహిళ కదులుతున్న రైలులో తనపై "అత్యాచారం చేయడానికి ప్రయత్నించినందుకు" రైల్వే సిబ్బందిపై ఫిర్యాదు చేసింది. ఢిల్లీకి వెళ్లే సద్భావన ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా ఆమె తన ఏడేళ్ల కుమార్తెతో నిద్రిస్తున్నప్పుడు నిందితులు "అనుచితంగా తాకడం" ప్రారంభించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ వ్యక్తిపై IPC సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.