ఇంట్లో చొరబడిన దొంగలు, మహిళపై ఘాతుకం, రూ.15లక్షల చోరీ..!

Published : Jul 08, 2021, 07:52 AM ISTUpdated : Jul 08, 2021, 07:58 AM IST
ఇంట్లో చొరబడిన దొంగలు, మహిళపై ఘాతుకం, రూ.15లక్షల చోరీ..!

సారాంశం

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ ఇంట్లో ఉన్న రూ.15లక్షల నగదు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.  


దొంగతనం కోసం ఇంట్లోకి చొరపడ్డారు. ఇంట్లో ఒంటరిగా కనిపించిన మహిళ పై  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం  ఆ ఇంట్లోని రూ.15లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోల్ కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్ లోకి  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. దొంగతనం కోసం వచ్చారు. ఈ క్రమంలో.. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ ఇంట్లో ఉన్న రూ.15లక్షల నగదు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా... అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయ్యిందని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. మహిళకు తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడ్డారా లేదా అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి ముందు మహిళను తాళ్లతో కట్టేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫేటేజ్ లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Ayatollah Ali Khamenei: ఖమేనీ ఖతంకన్నీళ్లు పెట్టుకున్న ముస్లిం మహిళలు| Asianet News Telugu
US Israel Iran Conflict : హర్మూజ్‌ దెబ్బ.. భారత్‌లో పెట్రోల్ రూ. 200 దాటుతుందా?