కోతుల గుంపు దాడి.. బీజేపీ నేత భార్య మృతి

By telugu news teamFirst Published Sep 8, 2021, 9:51 AM IST
Highlights

ఈ సంఘటనతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె.. కోతుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. 

కోతుల గుంపు దాడిలో ఓ బీజేపీ నేత  బార్య తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొహల్ల అల్కాలలోని బీజేపీ నాయకుడు అనిల్‌ కుమార్‌ చౌహాన్‌, సుష్మాదేవి (50) భార్యాభర్తలు. భార్య సుష్మ జిల్లా పంచాయతీ సభ్యురాలు. ఆమె మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి మూడో అంతస్తులో నిలుచుని ఉంది. ఈ సమయంలో కోతుల మంద దాడి చేసింది. 

ఈ సంఘటనతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె.. కోతుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో.. భవనం నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. మూడో అంతస్తు నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుష్మ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించేది. 

click me!