ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో మహిళ మృతదేహం.. ముఖం ఛిద్రం చేసి..

By SumaBala BukkaFirst Published Oct 27, 2023, 8:18 AM IST
Highlights

ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో ముఖం ఛిద్రమైన స్థితిలో ఓ మహిళ మృతదేహం లభించింది. 

న్యూఢిల్లీ : ఢిల్లీలోని మెట్రో స్టేషన్ సమీపంలో నిన్న ఓ మహిళ శవమై కనిపించింది. గుర్తు పట్టడానికి వీలు లేకుండా మహిళ మృతదేహాన్ని చిధ్రం చేశారు. దేశ రాజధానిలోని వెల్‌కమ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది.

30 ఏళ్లు పైబడిన మహిళ ముఖాన్ని హంతకులు ఛిద్రం చేసి.. సాక్ష్యాలను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. అనుమానితులను గుర్తించడానికి ఏదైనా క్లూ కోసం ఆ ప్రాంతంలోని సెక్యూరిటీ కెమెరాలను తనిఖీ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

click me!