
న్యూఢిల్లీ : బీహార్లో దారుణ ఘటన వెలుగు చూసింది. భూవివాదం కారణంగా 45 ఏళ్ల మహిళను దారుణంగా కొట్టి చంపారు. ఆ తరువాత ఆమె కళ్లు పెకిలించారు. మహిళ మృతదేహం ఖగారియా జిల్లాలో ఛిద్రమైన స్థితిలో కనుగొనబడింది. ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
సులేఖా దేవి అనే మహిళ మెహందీపూర్ గ్రామంలోని పొలంలో పని చేస్తుండగా ఆమెపై ఈ దాడి జరిగింది. ఆమె కుటుంబ సభ్యులు తమ పొరుగువారి ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐదుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.. వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
సత్యేందర్ జైన్ కు ఊరట. మధ్యంతర బెయిల్ ను పొడగించిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే ?
ఇదిలా ఉండగా, ఓ కోటీశ్వరుడు కూతురు ఓ రోజు జాగింగ్ కి వెళ్లి మృత్యువాత పడింది. ఆమెను ఓ కరుడుగట్టిన నేరస్థుడు తల మీద కాల్చి చంపేశాడు. ఆమెకు.. అతనికి.. అంతకుముందు పరిచయమూ లేదు.. ఎలాంటి శత్రుత్వమూ లేదు.. ఆమె పేరు ఎలిజా ఫ్లేచర్ (34). ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఎలిజా ఫ్లెచర్ తండ్రి కోటీశ్వరుడు. అమెరికాలోని టెన్నిసీ నగరం వీరి నివాసం. ఎలిజా ఫ్లెచర్ గా తన విధిని చక్కగా నిర్వహిస్తుంది.
మంచి తల్లిగా పేరుతెచ్చకుంది. చేతినిండా కావలసినంత డబ్బు.. ఎలాంటి చీకూ చింతాలేని జీవితం. కానీ మార్నింగ్ జాగింగ్ కు వెళ్లడం ఆమె జీవితంలో విషాదాన్ని నింపింది. ఆరోజు ఉదయం కూడా.. రోజు లాగే రోడ్డు వెంట జాగింగ్ కు వెళ్ళింది. ప్లెచర్. ఈ క్రమంలోనే ఓ కరుడుగట్టిన నేరస్తుడు ఆమెకు ఎదురుగా వచ్చాడు. యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ దగ్గర ఆమె జాగింగ్ కు అడ్డుగా వచ్చాడు. ఆమెకు గన్ చూపించి దగ్గర్లో చీకటిగా ఉన్న కొండ ప్రాంతానికి లాక్కెళ్లాడు.
ఆమె తల మీద గన్ పెట్టి కాల్చేశాడు. జాగింగ్ కు వెళ్లిన ప్లెజర్ ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో.. వెతికిన పోలీసులకు ఓ కొండ ప్రాంతంలో ఆమె మృతదేహం దొరికింది. వెంటనే పోస్టుమార్టం నిర్వహించగా బాధితురాలి తల వెనుక భాగంలో గన్ తో కాల్చడం వల్లే చనిపోయినట్లుగా తేలింది. ఈ హత్య వెలుగు చూసిన మరుసటి రోజే హంతకుడైన క్లియోథా అబ్ట్సన్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న సర్వేలెన్సు ఆధారంగా హంతకుడిని పట్టుకున్నారు.
దాడి జరిగిన ప్రాంతంలో నిందితుడి చెప్పుల జోడు ఆధారంగా.. డిఎన్ఏ రిపోర్టు ద్వారా అతనిని గుర్తించామని తెలిపారు. ఈ ఘటన నిరుడు సెప్టెంబర్ 2న జరిగింది. దీని మీద ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతుంది. అన్యాయంగా ఓ మహిళ ప్రాణాలు తీసిన దోషికి మరణశిక్ష విధించాలని ఆమె తరఫు న్యాయవాది కోరుతున్నారు. బాధితురాలు మీద నేరస్థుడు వ్యవహరించిన తీరు అత్యంత హేయంగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.