అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ.. భర్తను స్కార్ప్ తో గొంతు నులిమి చంపిన భార్య..

By SumaBala BukkaFirst Published Nov 28, 2022, 9:03 AM IST
Highlights

అన్నంలో చీమలున్నాయన్నందుకు భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవ చివరికి భర్త హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. 

ఒడిశా : వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య గొడవు మామూలే. భార్యైనా, భర్త అయినా ఒక మాట అనుకుని సర్ధుకుపోతే కాపురాలు నిలబడతాయి. అలా కాకుండా నలుగురి ముందూ అవమానిస్తే.. అది చిన్నవిషయమై అయినా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ఒకరి ప్రాణాలు మరొకరు తీసేంతవరకు వెళతాయి. తాజాగా ఒడిశాలో అలాంటి దారుణ ఘటనే జరిగింది. భార్య భర్తల మధ్య ఏర్పడిన చిన్నపాటి తగాదా.. తీవ్ర స్థాయికి చేరుకుని.. చివరకు ఒకరి హత్యకు దారితీసింది. 

ఒడిశాలోని సుందర్ గఢ్  జిల్లాలో ఓ మహిళ తన భర్తను క్షణికావేశంలో చంపేసింది. సుందర్ నగర్ జిల్లాకు చెందిన హేమంత బాఘ్ (35), సరిత (30) భార్య భర్తలు. వీరికి హేమలత,  సౌమ్య అనే కుమార్తెలు ఉన్నారు. హేమంత్ ట్రక్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా తన ప్లేట్ లో ఉన్న అన్నంలో హేమంత్ కు చీమలు కనిపించాయి. దీంతో చీమలు ఎలా వచ్చాయని భార్యని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ తారా స్థాయికి చేరుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన సరిత క్షణికావేశంలో భర్త గొంతును స్కార్ప్ తో నులిమి చంపేసింది. హేమంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సరితను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

స్కూల్ టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చిన మైనర్.. బంధువు అత్యాచారంతోనే..

ఇదిలా ఉండగా, భార్య తిట్లు భరించలేక విసుగుచెంది పథకం ప్రకారం ఆమెను హత్య చేశిన నిందితుడిని అరెస్టు చేసినట్లు కడప గ్రామీణ సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు…‘పీకే దీన్నే మండలం ఇందిరానగర్ కు చెందిన నరసింహారావు లక్ష్మీదేవికి కొన్నేళ్ళ కిందట వివాహమయ్యింది. వీరికి ఇంటర్ చదువుతున్న కొడుకు ఉన్నాడు. నరసింహారావు కడపలో ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నాడు. ఎదిగిన కొడుకు ఎదుటి భార్య భర్తని తిడుతూ, కొడుతూ ఉండేది. 

దీంతో భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 23న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో నరసింహారావు భార్యను గట్టిగా తోయడంతో... ఆమె విసురుగా వెళ్లి వంటగదిలో ఉన్న పదునైన రాయిపైన పడింది. దీంతో లక్ష్మీదేవికి తీవ్ర గాయాలయ్యాయి. అదే అదనుగా అనుకున్న భర్త వెంటనే ఆమె గొంతు నొక్కాడు. బలంగా నేలకేసి కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా రోజులాగే మామూలుగా స్కూల్ కి వెళ్ళాడు. లక్ష్మీదేవి విగతజీవిగా నేలపై పడి ఉండడం చూసిన స్థానికులు నరసింహారావుకు సమాచారమిచ్చారు.

దీంతో,  ఏమీ తెలియనట్టుగా.. తన భార్యను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని అందరిని నమ్మించాడు, అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సాక్షులను విచారించగా… భార్య పెట్టే వేధింపులు భరించలేక భర్తనే హత్య చేశాడని తెలిసింది. అప్పటికే నరసింహారావు పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరికితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పీకే దీన్నే ఆర్ఐ ఎదుట లొంగిపోయిన నేరాన్ని అంగీకరించాడు’ అని సీఐ చెప్పారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశామని అన్నారు. సమావేశంలో ఎస్సైలు అరుణ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, విష్ణు పాల్గొన్నారు. 

click me!