ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాడికి కడతేర్చింది.. మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టింది.. 

By Rajesh KarampooriFirst Published Jan 16, 2023, 3:47 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ‘దృశ్యం’ సినిమా తరహాలో ఓ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి హత్య చేసి, అతని మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న భవనంలోని సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ప్లాస్టరింగ్‌ చేశారు. రెండు వారాల్లోనే విషయం వెలుగులోకి రావడంతో నిందితుడైన భార్య, ఆమె ప్రేమికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడా వెలుగులోకి వచ్చింది. 

వివాహేతర సంబంధాల మోజులో పడి ఓ మహిళ తన కాపురాన్ని కూల్చుకుంది. తమను కట్టుకున్న భర్త మోసం చేసింది. సమాజం సిగ్గుతో తలదించుకునే పనులకు పాల్పడింది. తీరా భర్తనే అడ్డుగా భావించిన ఆ మహిళా..  తనతో ఏడడుగులు నడిచి, జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన భర్తని గొంతుకోసి అత్యంత దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఓ సేప్టీట్యాంకులో వేసి పాతిపెట్టింది. సమాజం తలదించుకునేలా చేసే ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కి చెందిన సతీష్‌కి వ్యక్తికి నీతూ అనే మహిళతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి  ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. వారి సంసారం ఎంతో సంతోషంగా సాగుతోంది. ఈ క్రమంలో సతీష్ తన భార్య, కొడుకుతో గ్రేటర్ నోయిడాకి వచ్చాడు. సరస్వతి కుంజ్‌ ప్రాంతంలో ఓ ఇంటిని నిర్మించుకోవాలని భావించారు. ఆ ఇంటి నిర్మాణ పనులకు హర్పాల్ అనే మేస్త్రీకి అప్పగించారు. 

ఈ క్రమంలో హర్పాల్ కు సతీష్ భార్య నీతుకు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. సతీష్ ఇంట్లో లేని సమయంలో ఇంటి మేస్త్రీని తన బెడ్‌రూమ్ కి రప్పించకుని రాసలీలలు కొనసాగించింది నీతు. బయట పని ఉందని చెప్పి.. హర్పాల్ రూమ్‌కి నీతు వెళ్లొచ్చేది. ఇలా వారి అక్రమ సంబంధానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. సభ్యసమాజం ఏమనుకుంటుందో అనే ఇంగితం లేకుండా వ్యవహరించారు. ఈ క్రమంలో కట్టుకున్న వారిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు నీతు.  అనుకున్న విధంగా ప్లాన్ వేసుకుంది. 

పథకం ప్రకారం.. నీతు, ఆమె ప్రియుడితో కలిసి ఒక డ్రింక్‌లో మత్తుమందు కలిపి  భర్త  సతీష్‌కి ఇచ్చారు. అది తాగిన సతీష్ స్పృహ కోల్పోయాడు. అదే సరైన సమయమని భావించిన నీతు ప్రియుడితో భార్త గొంతు కోసి చంపేసింది. అంతటితో ఆగకుండా... మృతదేహాన్ని పొరుగున నిర్మాణంలో ఉన్న ఇంటికి తరలించారు. నిర్మాణ దశలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని పాతిపెట్టారు. సతీష్ కనిపించకుండాపోవడంతో.. అతని సోదరుడు జనవరి 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు..  భార్య నీతుపై అనుమానం వచ్చి తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో  అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.  వివాహేతర సంబంధం కోసం ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేశానని నీతు నేరం అంగీకరించింది. 

click me!