క్రైం సీరియల్ చూసి.. భర్తకు మోతాదుకు మించి మందులిచ్చి... ఓ కిలాడీ లేడీ ఘాతుకం..

By SumaBala BukkaFirst Published Dec 10, 2022, 8:40 AM IST
Highlights

క్రైం సీరియల్స్ చూసి... తనకు అడ్డుగా ఉన్నాడనుకున్న భర్తను హతమార్చింది ఓ భార్య. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు పోలీసుల్ని ఆశ్చర్యపోయేలా చేశాయి. 

ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అతి కిరాతకంగా హతమార్చింది. అయితే దీని కోసం ఆమె వేసిన ప్లాన్ ఇప్పుడు అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె… భర్త ఆస్తి తన పేరిట రాసాడో లేదో అన్న అనుమానంతో అతడిని అంతమొందించింది. ఎక్కువ మోతాదులో మందులు ఇచ్చి భర్తను చంపింది. ఈ కిలాడీ లేడీ ఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ లో తాజాగా వెలుగు చూసింది.

ఈ ఘటనలో బాధితుడు కాన్పూర్లోని స్థానికంగా ఉన్న కళ్యాణ్ పుర్ శివ్లి రోడ్డు ప్రాంతానికి చెందిన రిషబ్. ఆ రోజు ఏం జరిగిందంటే..  అతను గత నెల 27వ తేదీన ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో అతని మీద కొందరు గుర్తు తెలియని దుండగులు హఠాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఇది గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకున్న తరువాత ఈ నెల ఒకటో తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు.

దారుణం.. మైనర్ తో ఆరునెలల్లో పెళ్లి.. కాబోయే భార్యమీద అత్యాచారం, హత్య... విషం తాగి ఆత్మహత్య...

అయితే,  ఆస్పత్రి నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా,  ఆరోగ్యంగా బయటకు వచ్చిన అతను రెండు రోజులకే ఆరోగ్యం క్షీణించి మరణించాడు. అతడి భార్య సప్నా.. తన భర్త మరణం మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో మోతాదుకు మించిన మందులు తీసుకోవడం వల్ల.. రిషబ్ శరీరం లోపల చాలా అవయవాలు దెబ్బతిన్నాయని  తేలింది. ఇది పోలీసులను అనుమానించేలా చేసింది.

దీంతో వీరు భార్య సప్నాతో పాటు మరి కొందరిని అనుమానితులుగా గుర్తించారు. వారి ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్ లను పరిశీలించారు. దీంతో వీరికి అసలు విషయం తెలిసిపోయింది. స్వప్నకు భర్త తన పేరిట ఆస్తి రాస్తాడు లేదా అన్న అనుమానం వచ్చింది. రాయకపోతే తన పరిస్థితి ఏంటి అనుకుంది.. ప్రేమికుడు రాజుతో కలిసి ఆమెనే హత్య చేయించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో స తో సప్నా నేరం అంగీకరించింది. మోతాదుకు మించి మందులు ఇవ్వడం వల్ల మనుషుల్ని చంపొచ్చని తాను ఓ క్రైమ్ సీరియల్లో చూశానని.. అదే తన భర్త విషయంలో ప్రయోగించానని సప్న వెల్లడించింది. 

click me!