భార్యల మార్పిడి రాకెట్ లో ప్రముఖులు.. వెలుగులోకి సంచలన విషయాలు..

Published : Jan 12, 2022, 11:13 AM IST
భార్యల మార్పిడి రాకెట్ లో ప్రముఖులు.. వెలుగులోకి సంచలన విషయాలు..

సారాంశం

భార్యల మార్పిడి బాగోతంలో ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి నిపుణులు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలు ఉన్నారని దర్యాప్తులో వెళ్లడవడంతో పోలీసులే దిగ్భ్రాంతి చెందారు.  గత మూడున్నరేళ్లుగా గ్రూపులో తనతో బలవంతంగా sex చేయించి డబ్బు సంపాదిస్తున్నాడంటూ ఓ గృహిణి  భర్తపై Complaint చేయడంతో పోలీసులు ఈ  ముఠా సభ్యుల కోసం వేట ప్రారంభించారు.

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన wife-swapping రాకెట్ బాగోతంలో పలువురు ప్రముఖుల పాత్ర కూడా ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. కేరళ డిజిపి అనిల్ కాంత్ పర్యవేక్షణలో సీనియర్ పోలీసు అధికారులు ఈ బాగోతంపై దర్యాప్తు చేస్తున్నారు. భార్యల మార్పిడి కేసులో celebrities ప్రమేయం కూడా ఉందని తేలింది.

భార్యల మార్పిడి బాగోతంలో ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి నిపుణులు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలు ఉన్నారని దర్యాప్తులో వెళ్లడవడంతో పోలీసులే దిగ్భ్రాంతి చెందారు.  గత మూడున్నరేళ్లుగా గ్రూపులో తనతో బలవంతంగా sex చేయించి డబ్బు సంపాదిస్తున్నాడంటూ ఓ గృహిణి  భర్తపై Complaint చేయడంతో పోలీసులు ఈ  ముఠా సభ్యుల కోసం వేట ప్రారంభించారు.

మీట్ అప్ కేరళ,  కేరళ కకోల్డ్, రియల్ మీట్ పేరిట సోషల్ మీడియా గ్రూపులు...

తన భర్త సమ్మతితోనే కొంతమంది వ్యక్తులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కొట్టాయం జిల్లాలోని Karukachal పట్టణానికి చెందిన  ఒక గృహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో 9మంది గ్రూపు సభ్యుల ఫోన్ నెంబర్లను కూడా ఇచ్చింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. భార్యల మార్పిడి రాకెట్ సభ్యుల మొబైల్ ఫోన్ల నుంచి  రికవరీ చేసిన చాట్ లు, కాల్ వివరాలను విశ్లేషించారు. 

ఈ విశ్లేషణలో వెలువడ్డ వాస్తవాలు వారిని షాక్ కు గురి చేశాయి. ఇలా భార్యల మార్పిడి కోసం 14 సోషల్ మీడియా గ్రూపులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. భార్యలను మార్పిడి చేసుకోవాలనుకునే వ్యక్తులు మీట్ అప్ కేరళ, కేరళ కకోల్డ్, రియల్ మీట్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో చురుకుగా ఉన్నారని పోలీసులు కనుగొన్నారు.

ఆసక్తి ఉన్నవారు తమ ఫొటోలను లొకేషన్ వివరాలతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలోవారి లైంగిక ప్రాధాన్యతలతో సహా పంచుకుంటున్నారు.

ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్ ఖాతాలో రహస్యంగా చాటింగ్ లు…

ఈ రహస్య చాట్ లు ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్  ఖాతాలలో గోప్యంగా ఉన్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఈ రాకెట్ లో కొట్టాయం,  పతనంతిట్ట,  అలప్పుజ  జిల్లాలకు చెందిన వారితో పాటు  బాధిత గృహిణి భర్త కూడా ఉన్నాడు. గృహిణిపై లైంగిక దాడి జరిపిన ముగ్గురు గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ముఠాలో ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకుందని పోలీసులు దర్యాప్తులో వెల్లడయింది. 

భర్తకు గల్ఫ్ దేశంలో ఉద్యోగం రావడంతో ఆయన వెళ్లిపోవడంతో అతని భార్య గ్రూపులో చేరిందని తెలిసింది. ఈ గ్రూపులో ఇతరులతో శృంగారం చేస్తున్న వీడియోను చిత్రీకరించి, దాన్ని కుటుంబసభ్యులకు పంపుతామని బెదిరించి ఈ బాగోతాన్ని సాగించారని పోలీసులు చెప్పారు. 

కాగా, రెండు రోజుల క్రితం లైంగిక సంబంధం కోసం భార్య‌ల‌ను మార్చుకున్న ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. లైంగిక సంబంధం కోసం భార్య‌ల‌ను మార్చుకుంటున్నార‌నీ, ఈ రాకెట్ లో భాగ‌మైన ఏడుగురిని  అరెస్టు చేశామ‌ని పోలీసులు తెలిపారు. అలాగే, మ‌రో 25 మందికి పైగా పరిశీలనలో ఉన్నారని, మరో రెండు రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్ల‌డించారు. ఇంతకుముందు కూడా రాష్ట్రంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగుచూశాయి.  

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !