
గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతిఖ్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్లు దుండగుల చేతిలో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. వీరి హత్యలతో ఉత్తరప్రదేశ్తో పాటు యావత్ దేశం ఉలిక్కిపడింది. అంతకు రెండు రోజుల ముందే అతిఖ్ కుమారుడు అసద్ , అనుచరుడు గుల్హామ్లు ఎన్కౌంటర్లో హతమైన నేపథ్యంలో అతిఖ్ కూడా హత్య గురికావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. హత్యల వెనుక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వుందని ఆరోపిస్తున్నాయి .
ఇదిలావుండగా.. అతిఖ్ సతీమణి షైస్తా పర్వీన్ ఎక్కడున్నరన్న దానిపై యూపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రోజుల వ్యవధిలో భర్త, కుమారుడు, మరో కుటుంబ సభ్యుడిని కోల్పోయి ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉమేశ్ పాల్ హత్య కేసులో పర్వీన్ ప్రమేయం కూడా వుందని పోలీసులు అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో యూపీ పోలీసుల రాడార్ నుంచి ఆమె తప్పించుకున్నారు. పర్వీన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా.. అతిఖ్, అష్రఫ్ల హత్యల విషయం తెలియగానే పర్వీన్ కళ్లు తిరిగి పడిపోయారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆమె ఈరోజు కానీ రేపు కానీ పోలీసులకు లొంగిపోతారని ప్రచారం జరుగుతోంది.
ALso Read: Atiq Ahmed: 17 ఏళ్లకే హత్య .. 44 ఏండ్ల నేర చరిత్ర.. 100 పైగా కేసులు.. చివరికి..
ఇకపోతే.. గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ల హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసుల కస్టడీలో ఉండగానే మీడియాకు లైవ్లో సమాధానాలు ఇస్తున్న సమయంలో ముగ్గురు నిందితులు వారిద్దరిపై కాల్పులు జరిపారు. ఆ ఇద్దరు స్పాట్లోనే మరణించారు. ఈ ఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు కమిటీ వేయాలని అధికారులకు సూచించారు. అలాగే, ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రయాగ్రాజ్లో అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ల హత్య జరగ్గానే ముఖ్యంగా యూపీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలీసులంతా అలర్ట్ మోడ్లో ఉన్నారు. అన్ని జిల్లాల్లో పోలీసులు నిఘా పెంచారు. సున్నితమైన ఏరియాల్లో పెట్రోలింగ్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో అల్లర్లను ఎదుర్కొనే పోలీసులూ మోహరించారు. అతీక్ సోదరుల హత్య తర్వాత సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసానికి భద్రతను పెంచారు . ఈ హత్య జరిగిన తర్వాత కనీసం 17 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు