మెటాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2023లో భారతదేశంలో రికార్డు స్థాయిలో 74 లక్షల ఖాతాలను నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రూల్స్ 2021 ప్రకారం.. ప్రచురించబడిన నెలవారీ నివేదికలో కంపెనీ ఈ సమాచారాన్ని అందించింది. ఈ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30, 2023 మధ్య కాలంలో 74 లక్షల భారత ఖాతాలను బ్యాన్ చేసింది.
అకౌంట్లను బ్యాన్ చేయడానికి గల కారణాలు
భారతదేశంలోని వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా WhatsApp ఖాతాలను నిషేధించింది. ఇది కాకుండా.. వాట్సాప్ సేవా నిబంధనల ఉల్లంఘన,గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (జిఎసి) నుండి వచ్చిన ఆర్డర్పై కొన్ని ఖాతాలపై కూడా చర్యలు తీసుకుంది. ఈ చర్యలపై వాట్సాప్ ప్రతినిధి మాట్లాడుతూ.. 'ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. మేము ఏప్రిల్ 2023 నెలలో మా నివేదికను ప్రచురించాము. ఈ వినియోగదారు-భద్రతా నివేదిక వినియోగదారుల నుండి స్వీకరించబడిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నాం.. WhatsApp ద్వారా తీసుకున్న చర్యలను వివరించామని తెలిపారు.
ఇది కాకుండా.. తమ ప్లాట్ఫారమ్లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి వాట్సాప్ స్వయంగా తీసుకున్న నివారణ చర్యల వివరాలను కూడా నివేదికలో పొందుపరిచినట్టు తెలిపారు. తాజా నెలవారీ నివేదిక ప్రకారం.. WhatsApp ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 7.4 మిలియన్లకు (74 లక్షలు) పైగా ఖాతాలను నిషేధించబడ్డాయి. వీటిలో 2.4 మిలియన్ల (24 లక్షలు) ఖాతాలు చాలా యాక్టివ్ గా ఉండేవి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ ఖాతాలను నిషేధించినట్టు తెలిపింది.
ట్విట్టర్ ఖాతాల నిషేధం
ఇది సమయంలో ట్విటర్ కూడా పలు ఖాతాలను నిషేధించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, లైంగిక కంటెంట్ను అందిస్తున్న మిలియన్ల కొద్దీ ఖాతాలను ట్విట్టర్ నిషేధించింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 25 మధ్య కాలంలో భారతదేశంలో పిల్లల లైంగిక వేధింపులు, లైంగిక కంటెంట్ను ప్రోత్సహించే 25 లక్షలకు పైగా భారతీయ ఖాతాలను నిషేధించినట్టు ట్విట్టర్ గురువారం (జూన్ 1) తెలిపింది.
గతంలోనూ తొలగింపు చర్యలు..
జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 మధ్యకాలంలో భారతదేశంలో 6,82,420 ఖాతాలను ట్విట్టర్ నిషేధించింది. పిల్లల లైంగిక వేధింపులు, అసభ్యకరమైన కంటెంట్ వ్యాప్తి చేయడం వంటి అసాంఘిక చర్యలు చేపడుతున్న ఖాతాలపై నిషేధం విధించింది. ఎలాన్ మస్క్ యొక్క మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ తన ప్లాట్ఫారమ్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న 1,548 ఖాతాలను కూడా తొలగించింది.
అదే సమయంలో.. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కూడా ఫిబ్రవరిలో భారతదేశంలో ఐటి రూల్స్ 2021 ప్రకారం రికార్డు స్థాయిలో 4.5 మిలియన్ ఖాతాలను నిషేధించింది. పారదర్శకంగా కొనసాగుతామని, భవిష్యత్ నివేదికలలో మా ప్రయత్నాల గురించి సమాచారాన్ని పొందుపరుస్తామని కంపెనీ తెలిపింది.