
Assassination of Rajiv Gandhi: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా ఉన్న పెరరివాలన్కు విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం అధికారాలను సుప్రీం కోర్టు అమలు చేసింది. రాజీవ్ హత్య కేసులో పెరరివాలన్.. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు. ఈ క్రమంలోనే తన శిక్షను మినహాయించాలని 2018లో తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసినప్పటికీ విడుదలలో జాప్యం జరుగుతుందని పెరరివాలన్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏజీ.పెరరివాలన్ మీడియాతో మాట్లాడుతూ.. "ఉరిశిక్ష అవసరం లేదని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని విడుదల కోసం సుప్రీంకోర్టు ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఆయన అన్నారు. బుధవారం తమిళనాడులో అతని కుటుంబ సభ్యులు, బంధువులు మరియు అనేక తమిళ అనుకూల సంస్థలు ఈ తీర్పును హర్షధ్వానాలతో స్వాగతించాయి. మొదట్లో చెన్నైలోని ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్షను విధించింది.. తరువాత జీవిత ఖైదుగా మార్చబడింది. పెరరివాలన్ తన భవిష్యత్తు గురించి ఆలోచించే ముందు అతను మొదట ఊపిరి కోసం.. స్పష్టంగా స్వేచ్ఛ వాయువులను.. గాలిని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
"నేను ఇప్పుడే బయటకు వచ్చాను. ఇది 31 సంవత్సరాల న్యాయ పోరాటం. నేను కొంచెం ఊపిరి పీల్చుకోవాలి. నాకు కొంత సమయం ఇవ్వండి" అని మీడియాతో అన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసు నుంచి ఉపశమనం లభించడం.. భవిష్యత్తు ప్రణాళికల గురించి మీడియా ప్రశ్నించగా ఆయన పై పెరరివాలన్ పై వ్యాఖ్యలు చేశారు.అలాగే, "ఉరిశిక్ష అవసరం లేదని నేను స్పష్టంగా నమ్ముతున్నాను. దయ కోసమే కాదు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సహా చాలా మంది న్యాయమూర్తులు అలా అన్నారు.. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందరూ మనుషులే" అని అతను తన తల్లి అర్పుతమ్మాళ్ మరియు బంధువులతో చెప్పాడు. "చాలా మంది తెలియని వ్యక్తులు మాకు మద్దతు ఇచ్చారు. వారిలో నాకు చాలా మంది తెలియదు. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని భావోద్వేగంతో అర్పుతమ్మాళ్ తన కుమారుని 31 ఏళ్ల పోరాటాన్నిగుర్తుచేసుకుంటూ భవోద్వేగానికి గురయ్యారు.
పెరారివాలన్ సుప్రీంకోర్టు తీర్పుతో విడుదలైన తర్వాత.. ' పరై ' ఒక ప్రాచీన తమిళ పెర్కషన్ వాయిద్యాన్ని వాయించాడు. ఇది ఆయన స్వేచ్ఛను జరుపుకునే స్పష్టమైన సంకేతంగా పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషిగా తేలిన పేరరివాలన్ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే జోలార్పేటలోని ఆయన నివాసానికి బంధువులు చేరుకోవడం ప్రారంభించారు. పెరారివాలన్ అర్పుతమ్మాళ్కు స్వీట్లు అందించారు.. తల్లీకొడుకులు తమకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పేరారివాలన్ని కలుసుకుని పలకరించడానికి తొందరపడిన అతని సోదరి మరియు ఆమె కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.. అతని విడుదల పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయనను కౌగిలించుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పెరవియాలన్ తండ్రి కుయిల్దాసన్ తన కుమారుడి 30 ఏళ్ల జైలు శిక్ష ముగియడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లితో సహా అతని భవిష్యత్తు ప్రణాళికల గురించి విలేకరులు అడిగినప్పుడు, అలాంటి విషయాలను కుటుంబం చర్చిస్తుందని చెప్పారు.