బెంగాల్ డీజీపీ నీరజ్ నయాన్‌ బదిలీ: సీఎంగా ప్రమాణం చేసిన గంటల్లోనే నిర్ణయం

Published : May 05, 2021, 03:47 PM ISTUpdated : May 05, 2021, 03:56 PM IST
బెంగాల్ డీజీపీ నీరజ్ నయాన్‌ బదిలీ: సీఎంగా ప్రమాణం చేసిన గంటల్లోనే  నిర్ణయం

సారాంశం

 డీజీపీ నీరజ్ నయాన్ ను  బదిలీ చేస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ బుధవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. సీఎంగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది. 

కోల్‌కత్తా:  డీజీపీ నీరజ్ నయాన్ ను  బదిలీ చేస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ బుధవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. సీఎంగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది.  వీరేంద్రను తిరిగి బెంగాల్ డీజీపీగా మమత బెనర్జీ నియమించింది. జావీద్ షమీమ్ ను శాంతిభద్రతల అడిషనల్ డీజీగా నియమిస్తూ  మమత సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఎన్నికల సమయంలో డీజీపీ వీరేంద్రను , అడిషనల్ డీజీ జావీద్ ను బదిలీ చేసింది ఈసీ. 

also read:మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా: మమత బెనర్జీ ప్రమాణం

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో హింస చెలరేగాయి. తమ పార్టీ కార్యాలయంపై టీఎంసీ దాడులకు దిగిందని బీజేపీ ఆరోపించింది. ఈ విషయమై గవర్నర్  మంగళవారం నాడు  రాష్ట్ర డీజీపీని పిలిచి మాట్లాడారు. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని కోరారు. కేంద్ర హోంశాఖ కూడ ఈ విషయమై నివేదిక కోరింది. మమత సీఎంగా ప్రమాణం చేసిన  కొద్దిసేపటి తర్వాత ఆ రాష్ట్ర గవర్నర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పనిచేయాలన్నారు. కొత్త తరహలో పాలనను సాగించాలని ఆయన మమతకు ఆయన సూచించారు. 

PREV
click me!

Recommended Stories

BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం