బెంగాల్ డీజీపీ నీరజ్ నయాన్‌ బదిలీ: సీఎంగా ప్రమాణం చేసిన గంటల్లోనే నిర్ణయం

Published : May 05, 2021, 03:47 PM ISTUpdated : May 05, 2021, 03:56 PM IST
బెంగాల్ డీజీపీ నీరజ్ నయాన్‌ బదిలీ: సీఎంగా ప్రమాణం చేసిన గంటల్లోనే  నిర్ణయం

సారాంశం

 డీజీపీ నీరజ్ నయాన్ ను  బదిలీ చేస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ బుధవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. సీఎంగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది. 

కోల్‌కత్తా:  డీజీపీ నీరజ్ నయాన్ ను  బదిలీ చేస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ బుధవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. సీఎంగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది.  వీరేంద్రను తిరిగి బెంగాల్ డీజీపీగా మమత బెనర్జీ నియమించింది. జావీద్ షమీమ్ ను శాంతిభద్రతల అడిషనల్ డీజీగా నియమిస్తూ  మమత సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఎన్నికల సమయంలో డీజీపీ వీరేంద్రను , అడిషనల్ డీజీ జావీద్ ను బదిలీ చేసింది ఈసీ. 

also read:మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా: మమత బెనర్జీ ప్రమాణం

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో హింస చెలరేగాయి. తమ పార్టీ కార్యాలయంపై టీఎంసీ దాడులకు దిగిందని బీజేపీ ఆరోపించింది. ఈ విషయమై గవర్నర్  మంగళవారం నాడు  రాష్ట్ర డీజీపీని పిలిచి మాట్లాడారు. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని కోరారు. కేంద్ర హోంశాఖ కూడ ఈ విషయమై నివేదిక కోరింది. మమత సీఎంగా ప్రమాణం చేసిన  కొద్దిసేపటి తర్వాత ఆ రాష్ట్ర గవర్నర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పనిచేయాలన్నారు. కొత్త తరహలో పాలనను సాగించాలని ఆయన మమతకు ఆయన సూచించారు. 

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో