తమిళనాడు, కేరళలల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

Bukka Sumabala   | Asianet News
Published : Dec 16, 2020, 10:58 AM IST
తమిళనాడు, కేరళలల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

సారాంశం

నివర్, బురేవి తుపాన్ల బీభత్సం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మరో భారీ వర్ష సూచన వణుకుపుట్టిస్తోంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.   

నివర్, బురేవి తుపాన్ల బీభత్సం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మరో భారీ వర్ష సూచన వణుకుపుట్టిస్తోంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 

ఈ వర్షాలు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో  ఎక్కువ ప్రభావం చూపుతాయని వెల్లడించారు. ఈ మేరకు వాతావరణశాఖ ట్విటర్‌లో ఒక పోస్టు పెట్టింది. 

తమిళనాడు, పుదుచ్చేరిల్లో 16 నుంచి 18 డిసెంబరు మధ్య, కేరళ, లక్షద్వీప్‌లలో 17 నుంచి 18 డిసెంబరు మధ్య ఈ భారీ వర్షాలు పడతాయన్నారు. డిసెంబరు నెల ప్రారంభంలో వారం రోజుల తేడాతో వచ్చిన నివర్‌, బురేవి తుపాన్ల నుంచి కోలుకుంటున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలను మళ్లీ వర్షాలు హడలెత్తించనున్నాయి.

PREV
click me!

Recommended Stories

Supreme Court On Protests: పోలీసు లాఠీలకు సుప్రీం బ్రేక్.. ఆందోళనలు చేస్తే కొడతారా?.. సీజేఐ సూర్యకాంత్
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !