నరబలి కేసులో ఒళ్లు గగుర్పొడిచే అంశాలు.. ముక్కలుగా నరికి.. శరీరలను ఉడికించుకుని తిన్న నిందితులు

Published : Oct 12, 2022, 01:46 PM ISTUpdated : Oct 12, 2022, 03:50 PM IST
నరబలి కేసులో ఒళ్లు గగుర్పొడిచే అంశాలు.. ముక్కలుగా నరికి.. శరీరలను ఉడికించుకుని తిన్న నిందితులు

సారాంశం

కేరళలో నరబలి ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను డబ్బు కోసం బలి ఇచ్చారు. అనంతరం, వారి కొన్ని బాడీ పార్టులనూ ఉడికించుకుని తిన్నారని నిందితులు చెప్పడం కలకలం రేపుతున్నది.  

తిరువనంతపురం: కేరళలో వెలుగుచూసిన నరబలి కేసు కలకలం రేపింది. ఆర్థిక సంపత్తి కోసం ఇద్దరు మహిళల(రోస్లిన్, పద్మ)ను అత్యంత క్రూరంగా బలి ఇచ్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. రోస్లిన్ శరీరాన్ని 56 ముక్కలుగా, పద్మ శరీరాన్ని 5 ముక్కలుగా కట్ చేసినట్టు తెలిసింది. అంతేకాదు, వారిని చంపిన తర్వాత ఉడికించుకుని తిన్నామని నిందితులు చెప్పడం దిగ్భ్రాంతికరంగా మారింది.

కేరళలోని పతానంతిట్ట జిల్లా ఎలంథూర్ గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ఈ కేసులో దంపతులు భగవాల్ సింగ్, లైలాలు అరెస్టయ్యారు. వీరిద్దరూ తిరువల్ల వాసులు. కాగా, రెస్లీ, పద్మలను వంచించి బలివ్వడానికి తెచ్చినట్టుగా భావిస్తున్న మహమ్మద్ షఫీని అరెస్టు చేశారు.

Also Read: దారుణం : కేరళలో ఇద్దరు మహిళల నరబలి, ముగ్గురి అరెస్ట్..

పోలీసులకు నిందితురాలు లైలా కీలక విషయాలు దర్యాప్తులో వెల్లడించారు. ధనం రావాలంటే నరబలి ఇవ్వాలని చెప్పిన వ్యక్తిని షఫీగా పేర్కొంది. ఆ షఫీ చెప్పిన సూచనల మేరకు చంపేసిన వారి బాడీ పార్టులనూ ఉడికించుకుని తిన్నట్టు వివరించింది. ఈ నరబలి జరుగుతుండగా వారు ఓ పుస్తకంలోని మంత్రాలనూ చదువినిట్టు తెలిపింది. ఈ మేరకు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో నిందితులను ఎర్నాకుళం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారికి 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది. నిందితులను విచారించడానికి కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌కు కోర్టు సమ్మతించింది. 

ఇదిలా ఉండగా, సీఎం పినరయి విజయన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ కేసు త్వరితగతిన విచారించాలని ఆదేశించారు. నరబలి రాకెట్ గుట్టు విప్పాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు ఇంకా ఎక్కడైనా జరిగాయా? జరుగుతున్నాయా? వంటి విషయాలనూ దర్యాప్తు చేయాలని సూచించారు. నరబలి రాకెట్ మీద పూర్థి స్థాయిలో విచారించాలని ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే