ఆదివాసీ ముంగిట‌కు వెళ్తున్నాం.. వారి సాధికారతను పెంచే ముఖ్య కార్యక్రమం ఇది : ఆది మహోత్సవ్‌లో ప్రధాని మోడీ

Published : Feb 16, 2023, 01:27 PM IST
ఆదివాసీ ముంగిట‌కు వెళ్తున్నాం.. వారి సాధికారతను పెంచే ముఖ్య కార్యక్రమం ఇది : ఆది మహోత్సవ్‌లో ప్రధాని మోడీ

సారాంశం

New Delhi: వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి సవాళ్లకు పరిష్కారాలు కావాలంటే మన గిరిజనుల జీవన సంప్రదాయాన్ని చూడండని నేడు భారతదేశం ప్రపంచానికి చెబుతోందని ప్ర‌ధ‌ని న‌రేంద్ర మోడీ అన్నారు. దీంతో ఆయా సమ‌స్య‌లకు ఒక ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని తెలిపారు. క్రియాశీలక రాజకీయాల్లో లేనప్పుడు గిరిజన సంఘాలు, కుటుంబాలను సందర్శించి వారితో తగినంత సమయం గడిపేవాడిన‌నీ, గిరిజన సమాజపు ఆచారాల నుంచి చ‌లా నేర్చుకున్నాన‌ని ప్ర‌ధాని అన్నారు.  

Aadi Mahotsav 2023: దేశ రాజ‌ధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ "ఆది మహోత్సవ్" ను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు (ఫిబ్రవరి 16) ప్రారంభించారు. గిరిజన సంస్కృతి, హస్తకళలు, ఆహారం, వాణిజ్యం, సంప్రదాయ కళలను ప్రదర్శించే జాతరగా దీనికి గుర్తింపు ఉంది. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి పీఎం నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. గిరిజ‌నుల‌ వివిధ కళలు, కళాఖండాలు, సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలను, తమ ఉత్పత్తులను చూడటం ఆనందంగా ఉందన్నారు. భారతదేశ వైవిధ్యం, దాని గొప్పతనం కలిసి ఉన్నాయని తాను భావిస్తున్నాన‌నీ, నేడు భార‌త సంప్రదాయ వైవిధ్యం ప్ర‌పంచ‌వ్యాప్తం చేస్తున్న‌ట్టు తెలిపారు. "21వ శతాబ్దపు నవ భారతం 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' అనే సిద్ధాంతంపై పనిచేస్తోంది. చాలా కాలంగా ప్ర‌ధాన స‌మాజ స్ర‌వంతికి దూరంగా ఉంటున్న ప్రజలకు చేరువయ్యేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది" అని తెలిపారు.

 

 

"ఈ దేశ అనేక  వైవిధ్యాలు ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ అనే అంశంతో మనల్ని కలుపుతాయి. మీ అందరికీ ఆది మహోత్సవ్ శుభాకాంక్షలు. భారతదేశ వైవిధ్యం, వైభవం ఈ రోజు కలిసి నిలిచినట్లు అనిపిస్తుంది. ఇది భారతదేశ అనంత ఆకాశం వంటిది, దీనిలో దాని వైవిధ్యం ఇంద్రధనుస్సు వలె ఉద్భవిస్తుంది. వివిధ కళలు, కళాఖండాలు, సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలను వారి ఉత్పత్తుల ద్వారా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశ వైవిధ్యం-దాని వైభవం కలిసి వచ్చాయి.. నేడు దాని సంప్రదాయాన్ని హైలైట్ చేస్తున్నాయని నేను అనుకుంటున్నాను" అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆది మ‌హోత్స‌వ్ ప్రారంభం అనంత‌రం మాట్లాడుతూ అన్నారు. 

'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' తంతులో వైవిధ్యాలు క‌లుసుకున్న‌ప్పుడు భారతదేశ వైభవం ప్రపంచం ముందు ఆవిష్కృతమవుతుందని ప్ర‌ధాని అన్నారు. ఈ ఆది మహోత్సవం ఈ స్ఫూర్తికి చిహ్నం నిలుస్తూ.. గిరిజ‌న అభివృద్ధి-భార‌త వారసత్వ ఆలోచనను మరింత చైతన్యవంతం చేస్తోందని చెప్పాడు. తమను తాము సుదూర ప్రాంతాలుగా భావించే వారి ఇంటి ముంగిటకు ప్రభుత్వం వెళ్లి వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్న‌ద‌ని చెప్పారు. అలాగే, "21వ శతాబ్దపు నవ భారతం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అనే సిద్ధాంతంపై పనిచేస్తోంది. చాలా కాలంగా సంప్రదించని వారిని చేరుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మీ మధ్యకు రావడం ద్వారా నేను నా ప్రియమైన గిరిజ‌న స‌మూహంతో క‌లిసిపోయాన‌ని" ప్ర‌ధాని మోడీ అన్నారు. 

దేశంలోని ప్రతి మూలలో ఉన్న గిరిజన సమాజంతో తాను చ‌లా స‌మ‌యం గ‌డిపాన‌ని చెప్పిన ప్ర‌ధాని.. వారి సంప్రదాయాలను దగ్గరగా చూడ‌టంతో పాటు వాటి నుంచి అనేక విష‌యాలు నేర్చుకున్నాన‌ని అన్నారు. గిరిజనుల జీవనశైలి దేశ వారసత్వం, సంప్రదాయాల గురించి త‌న‌కు చాలా నేర్పిందని కూడా పేర్కొన్నారు.  గత ఎనిమిదేళ్లుగా 'ఆది మహోత్సవం' వంటి కార్యక్రమాలు దేశానికి ఒక ఉద్యమంగా మారాయ‌ని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu