రైలు ఎక్కనివ్వలేదని..మహిళల రైలురోకో

Published : Apr 04, 2019, 12:48 PM IST
రైలు ఎక్కనివ్వలేదని..మహిళల రైలురోకో

సారాంశం

రైలు ఎక్కేందుకు అడ్డుకున్నారని.. కొందరు మహిళలు గురువారం ఉదయం రైల్ రోకో చేపట్టారు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. 

రైలు ఎక్కేందుకు అడ్డుకున్నారని.. కొందరు మహిళలు గురువారం ఉదయం రైల్ రోకో చేపట్టారు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబయి లోకల్ ట్రైన్ ఈ రోజు ఉదయం 7గంటల సమయంలో దివా జంక్షన్ కి చేరుకుంది. ఆ సమయంలో లేడిస్ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కేందుకు కొందరు మహిళలు ప్రయత్నించారు. కాగా.. వారిని లోపలికి రానివ్వకుండా.. అప్పటికే అందులో ఉన్న కొందరు అడ్డుకున్నారు. ఆ బోగిలో సీట్లు ఖాళీగా లేవని అందులో ఉన్న మహిళలు.. ఎక్కడానికి వచ్చిన వారిని అడ్డుకున్నారు. దీంతో.. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో.. కోపంతో ఊగిపోయిన మహిళలు.. ఆ రైలును అక్కడి నుంచి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దాదాపు 2గంటల పాటు రైల్వే సేవలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. రెండు గంటల ఆలస్యంగా మళ్లీ రైళ్లు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu