రీటైల్ రంగంలో నెలకొన్న పోటీని తట్టుకొని తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోడానికి దిగ్గజ ఇ కామర్స్ సంస్థ వాల్మార్ట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా టెక్నాలజీ మరింత పెంచుకుని పోటీ సంస్థలకు దీటైన జవాబివ్వాలని చూస్తోంది. అందుకోసం భారీ సంఖ్యలో, అంతకంటే భారీ వేతనాలతో టెకీలను నియమించుకోడానికి సిద్దమైంది.
రీటైల్ రంగంలో నెలకొన్న పోటీని తట్టుకొని తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోడానికి దిగ్గజ ఇ కామర్స్ సంస్థ వాల్మార్ట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా టెక్నాలజీ మరింత పెంచుకుని పోటీ సంస్థలకు దీటైన జవాబివ్వాలని చూస్తోంది. అందుకోసం భారీ సంఖ్యలో, అంతకంటే భారీ వేతనాలతో టెకీలను నియమించుకోడానికి సిద్దమైంది.
భారతదేశంలోని విస్తృత మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని వాల్మార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఇండియాలో ఇ కామర్స్ బిజినెస్ పీక్ స్టేజ్ లో ఉంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుని కనీవినీ ఎరుగని రీతిలో వినియోగదారులను పెంచుకోవాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. ఇందుకోసమే ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
టెక్నాలజీ ఆపరేషన్స్ విస్తరణ కోసం భారీగా టెకీలను నియమించుకునేందుకు సిద్దపడుతోంది. దేశీయంగా దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను నియమించుకోనుంది. ఎంపిక చేసిన టెకీలకు 6 లక్షలనుంచి 22 లక్షల రూపాయల దాకా వేతనాలను ఆఫర్ చేయనుంది. గురగావ్, బెంగళూరు కేంద్రాలుగా సేవలను అందిస్తున్న తమ సంస్థలో ప్రస్తుతం 1800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వాల్మార్ట్ ముఖ్య సమాచార అధికారి క్లే జాన్సన్ వెల్లడించారు.