కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు.. ఐదేళ్ల జైలు శిక్ష

Published : Sep 07, 2021, 02:14 PM IST
కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు.. ఐదేళ్ల జైలు శిక్ష

సారాంశం

హోం క్వారంటైన్ లో ఉండమని అక్కడి ప్రభుత్వం సూచించింది. దాదాపు 28 రోజుల పాటు.. హోం  క్వారంటైన్ లో ఉండమని సూచించారు.


కోవిడ్ రూల్ బ్రేక్ చేసి.. కరోనా వ్యాప్తికి కారణమయ్యాడంటూ.. ఓ వ్యక్తికి ఏకంగా ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన వియత్నాం లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రావిన్షియల్ పీపుల్స్ కోర్టు వెబ్ సైట్ లో తెలియజేసిన వివరాల ప్రకారం.. లెవాన్ ట్రై అనే వ్యక్తి ఈ ఏడాది జులైలో.. కరోనా హాట్ స్పాట్ గా ఉన్న సిటీకి వెళ్లాడు. ఆ తర్వాత వియత్నమీస్ రూల్స్ ప్రకారం.. హోం క్వారంటైన్ లో ఉండమని అక్కడి ప్రభుత్వం సూచించింది. దాదాపు 28 రోజుల పాటు.. హోం  క్వారంటైన్ లో ఉండమని సూచించారు.

అయితే.. సదరు వ్యక్తి ఆ రూల్స్ ని బ్రేక్ చేశాడు. హోం క్వారంటైన్ లో ఉండకుండా బయటకు తిరిగాడు., దీంతో.. అతని కారణంగా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఓ వ్యక్తి ఏకంగా ఆగస్టు 2021 లో  ప్రాణాలు కూడా కోల్పోయాడు.  లెవాన్ ట్రై కారణంగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ రాగా.. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

అతను క్వారంటైన్ లో ఉండి ఉంటే.. ఈ ప్రమాదం జరగకుండా ఉండేదని న్యాయస్థానం పేర్కొంది. రూల్స్ పట్టించుకోకుండా కరోనా వ్యాప్తి చేసిందుకు గాను..  లెవాన్ ట్రైకి అక్కడి న్యాయస్థానం ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది.

PREV
click me!

Recommended Stories

Viral News: పెళ్లి రద్దుకు కారణమైన ప్రీ వెడ్డింగ్ షూట్.. అసలేం జరిగిందంటే.?
Droupadi Murmu Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము| Asianet News Telugu