కేరళకు నెల జీతం విరాళం ప్రకటించిన వెంకయ్యనాయుడు

Published : Aug 20, 2018, 03:54 PM ISTUpdated : Sep 09, 2018, 12:32 PM IST
కేరళకు నెల జీతం విరాళం ప్రకటించిన  వెంకయ్యనాయుడు

సారాంశం

కేరళలో వరద పరిస్థితిపై వెంకయ్యనాయుడు డిప్యూటీ సీఎం సహా పలువురు రాజ్యసభ సభ్యులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 

భారీ వరదలతో కేరళ అతలాకుతలమైంది. ఇప్పటికే పలువురు తమకు తోచిన సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొందరు కూడా విరాళం ప్రకటించారు. కేరళ వరద బాధితుల సహాయార్థం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హర్షవంశ్, ఇతర రాజ్యసభ సభ్యులు తమ నెలరోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. 

కేరళలో వరద పరిస్థితిపై వెంకయ్యనాయుడు డిప్యూటీ సీఎం సహా పలువురు రాజ్యసభ సభ్యులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సీనియర్ అధికారులు, ఉపరాష్ట్రపతి సచివాలయ అధికారులు, ఐవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

 మరోవైపు శివసేనకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కేరళ సహాయనిధికి నెలరోజుల వేతనాన్ని ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీలు సైతం తమ నెలరోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

మరో వీడియో రిలీజ్ చేసిన మోదీ ఏమన్నారంటే? | PM Narendra Modi Releases Another Video on Exam Reforms
ప‌రీక్ష‌ల వ్య‌వ‌స్థ‌లో కేంద్రం భారీ సంస్క‌ర‌ణ‌లు.. హైప‌వ‌ర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు