బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి, ముగ్గురు పిల్లలు పుట్టాక.. యువకుడి అరెస్ట్..

Published : Jul 22, 2021, 10:18 AM IST
బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి, ముగ్గురు పిల్లలు పుట్టాక.. యువకుడి అరెస్ట్..

సారాంశం

మైనర్ బాలికను వివాహం చేసుకుని, మూడేళ్లుగా కాపురం చేస్తున్న యువకుడిపై పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

యూపీ : పదిహేనేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, పెళ్లాడి కాపురం చేసిన యువకుడిమీద పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మౌ జిల్లాలో వెలుగు చూసింది. 15 యేళ్ల మైనర్ బాలికను మూడేళ్ల క్రితం కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడు. 

వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మైనర్ బాలికను వివాహం చేసుకుని, మూడేళ్లుగా కాపురం చేస్తున్న యువకుడిపై పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుమీద కేసు నమోదు చేసిన పోలీసులు మూడేళ్ల తరువాత అరెస్ట్ చేశారు. 

నిందితుడి ఆస్తిని సీజ్ చేసి, సమాచారం అందజేసిన వ్యక్తికి రూ. 25 వేల బహుమతి ఇచ్చారు. బాలికను కిడ్నాప్ చేసి, పెళ్లి చేసుకుని, మూడుళ్లు కాపురం చేసి, పిల్లలు పుట్టాక పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu