Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వ‌ర్ష బీభత్సం..విరిగిప‌డ్డ విద్యుత్ స్తంభాలు.. దెబ్బతిన్న బోట్లు..

Published : May 11, 2022, 03:52 PM IST
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వ‌ర్ష బీభత్సం..విరిగిప‌డ్డ విద్యుత్ స్తంభాలు.. దెబ్బతిన్న బోట్లు..

సారాంశం

Uttarakhand cyclone: ఉత్త‌రాఖండ్ లో వ‌ర్ష బీభ‌త్సం నెల‌కొంది. అక‌స్మాత్తుగా భారీ వ‌ర్షం కార‌ణంగా తెహ్రీ డ్యామ్ సరస్సు వైపు ఉన్న బోటింగ్ పాయింట్‌లో భయాందోళనలు నెల‌కొన్నాయి. ఏకంగా వ‌ర్షం ధాటికి 40 బోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు, స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  

Uttarakhand-Tehri Dam: అకస్మాత్తుగా మారిన వాతావరణం ఉత్తరాఖండ్‌లో కలకలం సృష్టించింది. బుధ‌వారం రాష్ట్రంలోని ప‌లు చోట్ల భారీ వ‌ర్షం విరుచుకుప‌డింది. వ‌ర్ష బీభ‌త్సం కార‌ణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. క‌రెంట్ వైర్లు తెగిప‌డ్డాయి. చెట్లు నేల‌కూలాయి. అక‌స్మాత్తుగా భారీ వ‌ర్షం కార‌ణంగా తెహ్రీ డ్యామ్ సరస్సు వైపు ఉన్న బోటింగ్ పాయింట్‌లో భయాందోళనలు నెల‌కొన్నాయి. ఏకంగా వ‌ర్షం ధాటికి 40 బోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బలమైన తుఫాను కారణంగా చాలా బోట్ల ఇంజిన్లు టెహ్రీ సరస్సులో మునిగిపోయాయి, ఇతర పడవలు దెబ్బతిన్నాయి. అయితే బోటులో చిక్కుకున్న పర్యాటకులందరినీ తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు.

ఈ తుఫాను కారణంగా తెహ్రీలో బోటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ తుఫాను తెహ్రీ లేక్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. దీంతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీని వల్ల అక్కడ కరెంటు ఎప్పటి వరకు వస్తుందో తెలియ‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. 

భారీ వ‌ర్ష ప్ర‌భావం గురించి స్థానికులు మాట్లాడుతూ... కోటికలోని బోటింగ్ పాయింట్ వద్ద పార్క్ చేసిన పదుల సంఖ్యలో పడవలు భారీగా దెబ్బతిన్నాయ‌ని చెప్పారు. దాదాపు ఆరేండ్ల తర్వాత తెహ్రీ సరస్సులో ఇంత భయంకరమైన తుఫాను వచ్చిందని చెప్పారు. 2016 తర్వాత ఈ రేంజ్ లో తెహ్రీ సరస్సులో తుపాను బీభత్సం సృష్టించిందని..  పడవలకు ఇంత నష్టం వాటిల్లిందని బోట్ నిర్వాహకులు చెబుతున్నారు. తమను ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నారు. సరస్సు ఒడ్డున నిలిపి ఉంచిన పడవలకు భద్రత కల్పించాలని, దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం చెల్లించాలని బోట్ నిర్వాహకులు ప్రభుత్వాన్ని, పాలకవర్గాన్ని కోరుతున్నారు. 

ఇదిలావుండ‌గా, ఉత్తరాఖండ్‌లోని ఫ్రాంటియర్ జిల్లాలో బుధవారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. ఈ జిల్లాలో భూకంపం  ప్రకంపనలు నేపాల్ ప్రాంతాలలో ఉన్నాయ‌ని స‌మాచారం. ఇది నేపాల్ సరిహద్దుతో అనుసంధానించబడినందున అంచనా వేయబడింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు . అదే సమయంలో, ఈ భూకంపం భౌగోళిక కేంద్రం నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న అస్కోట్ సమీపంలో ఉందని సంబంధిత అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతంలో ఈ తీవ్రతతో భూకంపాలు వస్తూనే ఉన్నాయని చెబుతున్నారు. అటువంటి తీవ్రత ప్ర‌కంప‌న‌లు సాధారణంగా ఎటువంటి నష్టాన్ని కలిగించవు. పితోర్‌ఘర్ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో దాని కేంద్రం అస్కోట్‌లో ఉన్నందున , నేపాల్ సరిహద్దులో ప్రకంపనలు సంభవించవచ్చు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం సంచలనం.. 816 సీట్లు.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎంపీ స్థానాలు ఇవే !
Modi Speech on Delimitation in Parliament డీ లిమిటేషన్ పైపార్లమెంటులో మోదీ స్పీచ్ | Asianet Telugu