Uttar Pradesh : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ వేగంగా ఏఐ ఆధారిత పాలనకు కేంద్రంగా మారుతోంది. టెక్నాలజీ ద్వారా ప్రతి రంగంలో యూపీ దేశానికే కాకుండా, ప్రపంచానికి ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాలని సీఎం యోగి లక్ష్యంగా పెట్టుకున్నారు. చాలా దేశాలు ఇంకా ఏఐ ప్రయోగాల ప్రారంభదశలో ఉండగా, యూపీ ఇప్పటికే పలు రంగాల్లో ఏఐని పెద్దఎత్తున అమలు చేసింది. యోగి టెక్నాలజీని నినాదంగా కాకుండా పాలనలో శాశ్వత భాగంగా మార్చారు. దీంతో యూపీ తన భవిష్యత్తును కొత్త రూపంలో తీర్చిదిద్దుకుంటోంది.
యూపీ రాజధాని లక్నోను దేశంలోనే తొలి పూర్తిస్థాయి ఏఐ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ కేవలం స్మార్ట్ సిటీ మోడల్ మాత్రమే కాదు, ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోను ఏఐ ఆధారిత జాతీయ పాలన-కమాండ్ సెంటర్గా అభివృద్ధి చేస్తున్నారు.
సీఎం యోగి నాయకత్వంలో యూపీ ఆరోగ్య రంగం వేగంగా సాంకేతిక మార్పులకు లోనవుతోంది. ఇప్పుడు చికిత్స మాత్రమే కాదు, ఏఐ సహాయంతో వ్యాధులను ముందుగానే అంచనా వేయడం కూడా సాధ్యమవుతోంది.
ఉత్తరప్రదేశ్ డిజిటల్ విద్యలో కొత్త మోడల్ వైపు అడుగులు వేస్తోంది. సీఎం యోగి టెక్నాలజీని గ్రామీణ తరగతి గదులకు, ప్రపంచ స్థాయి విద్యకు మధ్య వారధిగా భావిస్తున్నారు.
ప్రపంచ బ్యాంకు సపోర్ట్ తో యూపీ అగ్రిస్ కార్యక్రమం ద్వారా 10 లక్షల కంటే ఎక్కువ మంది రైతులు ఏఐ ఆధారిత సలహాలు పొందుతున్నారు. ఉపగ్రహ చిత్రాలు, పరిశోధనాత్మక విషయాలు, వాతావరణ సూచనలు, డిజిటల్ ట్రాకింగ్ సహాయంతో వ్యవసాయం మరింత శాస్త్రీయంగా, ఉత్పాదకంగా మారుతోంది.
ఏఐ ఆధారిత ప్రయోజనాలు:
ఏఐ ఆధారిత వ్యవస్థ వల్ల ఇప్పుడు సంక్షేమ పథకాలు నెమ్మదిగా కాకుండా, రియల్-టైమ్ సేవగా మారాయి.